AI : అదిరింది.. హైదరాబాద్లో AIతో సూదిరహిత రక్త పరీక్షలు..
- నీలోఫర్ ఆస్పత్రి ఆవిష్కరించిన ఏఐ ఆధారిత సూది లేని రక్త పరీక్ష
- ఫోటోప్లెథిస్మోగ్రఫీ సాంకేతికతతో నొప్పి లేని నిర్ధారణ
- త్వరితంగా, ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షల్లో మార్పులు
AI : రక్త పరీక్ష అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది – సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, నడుమున్న వయసువారు దీనికి కొంచెం భయపడుతుంటారు కూడా. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాదులోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు, టెక్నాలజీ వినియోగంలోనూ ఒక విప్లవాత్మక ముందడుగుగా చెప్పవచ్చు.
‘అమృత్ స్వాస్థ్ భారత్’ అనే పేరుతో పరిచయమైన ఈ టూల్ను క్విక్ విటల్స్ (Quick Vitals) అనే హెల్త్-టెక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తి స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారితంగా పనిచేస్తుంది. రోగి శరీరంలో సూది వేయకుండానే, కేవలం చర్మంపై సెన్సార్ల సహాయంతో రక్త ప్రవాహంలో మార్పులను గుర్తించగల సామర్థ్యం ఈ టూల్కు ఉంది. ఈ ప్రక్రియకు ‘ఫోటోప్లెథిస్మోగ్రఫీ (Photoplethysmography – PPG)’ అనే సాంకేతికతను ఆధారంగా తీసుకున్నారు.
Also Read
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
Viral : నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు
ఈ విధానం ద్వారా రక్తపోటు, SpO2, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1c, స్ట్రెస్ స్థాయిలు వంటి ఆరోగ్య సంబంధిత కీలక సమాచారాన్ని 20-60 సెకన్ల వ్యవధిలోనే అందించగలదు. ఈ టెస్టు వల్ల రోగికి ఎలాంటి నొప్పి లేకుండానే, వేగంగా , ఖచ్చితంగా ఫలితాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వంటి సూదులకు భయపడే వారికీ ఇది ఒక వరంలాంటిదే.
ఇలాంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయడం అరుదైన విషయమే. అందులోనూ నీలోఫర్ ఆసుపత్రి మొదటగా ఈ సేవను ప్రారంభించడం గర్వకారణంగా మారింది. ప్రస్తుతం ఈ టూల్ వినియోగం మొదటి దశలో ఉన్నా, భవిష్యత్తులో ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్పు, టెక్నాలజీ ఆరోగ్యరంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందోననే ప్రశ్నకు సమాధానమే కాదు… రోగులకు దగ్గరగా, మరింత మానవీయంగా వైద్యం ఎలా ఉండాలో చూపించే మార్గదర్శకంగానూ నిలుస్తోంది. AI టెక్నాలజీ మానవ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?