AI : అదిరింది.. హైదరాబాద్లో AIతో సూదిరహిత రక్త పరీక్షలు..
- నీలోఫర్ ఆస్పత్రి ఆవిష్కరించిన ఏఐ ఆధారిత సూది లేని రక్త పరీక్ష
- ఫోటోప్లెథిస్మోగ్రఫీ సాంకేతికతతో నొప్పి లేని నిర్ధారణ
- త్వరితంగా, ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI : రక్త పరీక్ష అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది – సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, నడుమున్న వయసువారు దీనికి కొంచెం భయపడుతుంటారు కూడా. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాదులోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు, టెక్నాలజీ వినియోగంలోనూ ఒక విప్లవాత్మక ముందడుగుగా చెప్పవచ్చు.
‘అమృత్ స్వాస్థ్ భారత్’ అనే పేరుతో పరిచయమైన ఈ టూల్ను క్విక్ విటల్స్ (Quick Vitals) అనే హెల్త్-టెక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తి స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారితంగా పనిచేస్తుంది. రోగి శరీరంలో సూది వేయకుండానే, కేవలం చర్మంపై సెన్సార్ల సహాయంతో రక్త ప్రవాహంలో మార్పులను గుర్తించగల సామర్థ్యం ఈ టూల్కు ఉంది. ఈ ప్రక్రియకు ‘ఫోటోప్లెథిస్మోగ్రఫీ (Photoplethysmography – PPG)’ అనే సాంకేతికతను ఆధారంగా తీసుకున్నారు.
Also Read
Viral : నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు
ఈ విధానం ద్వారా రక్తపోటు, SpO2, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1c, స్ట్రెస్ స్థాయిలు వంటి ఆరోగ్య సంబంధిత కీలక సమాచారాన్ని 20-60 సెకన్ల వ్యవధిలోనే అందించగలదు. ఈ టెస్టు వల్ల రోగికి ఎలాంటి నొప్పి లేకుండానే, వేగంగా , ఖచ్చితంగా ఫలితాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వంటి సూదులకు భయపడే వారికీ ఇది ఒక వరంలాంటిదే.
ఇలాంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయడం అరుదైన విషయమే. అందులోనూ నీలోఫర్ ఆసుపత్రి మొదటగా ఈ సేవను ప్రారంభించడం గర్వకారణంగా మారింది. ప్రస్తుతం ఈ టూల్ వినియోగం మొదటి దశలో ఉన్నా, భవిష్యత్తులో ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్పు, టెక్నాలజీ ఆరోగ్యరంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందోననే ప్రశ్నకు సమాధానమే కాదు… రోగులకు దగ్గరగా, మరింత మానవీయంగా వైద్యం ఎలా ఉండాలో చూపించే మార్గదర్శకంగానూ నిలుస్తోంది. AI టెక్నాలజీ మానవ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!