ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా…
తాలిబన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరికి సమానమైన గుర్తింపు ఇస్తామని, ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతామని చెప్పిన తాలిబన్లు దానికి విరుద్ధంగా చేశారు. ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు. పైగా మహిళలు ఇంటికే పరిమితం కావాలని, రాజకీయాల్లోకి వారి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. బాలికల చదువుకు 1-5 తరగతుల వరకు మాత్రమే అనుమతించారు. దీంతో మహిళల పట్ల తాలిబన్లకు ఎలాంటి దృష్టి…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి…
ఆఫ్ఘనిస్థాన్లో తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు.. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూనే.. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. ఏ ఆటలు ఆడొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. బాలురు-బాలికలు కలిచి చదువుకోవడానికి వీలులేదని స్పష్టంచేశారు.. బాలికలకు మహిళలే పాఠాలు చెప్పాలని.. మహిళలు బాలురకు కూడా పాఠాలు బోధించొద్దు అంటూ.. పిచ్చిపిచ్చి షరతులు పెట్టారు.. ఒకేవేళ కో-ఎడ్యుకేషన్ కొనసాగినా.. తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరలు…
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నాక పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. అప్ఘన్లో ఎక్కడ చూసినా.. ఎవరినీ కదిలించినా హృదయ విదారక సంఘటనలే దర్శనమిస్తున్నాయి. తమ దేశంలోనే పరాయివాళ్లలా పొట్టచేత బట్టుకొని జీవించాల్సిన దుస్థితి అప్ఘన్లకు రావడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. తాలిబన్ల చెర నుంచి తమను రక్షించాలని నిస్సాహాయ స్థితిలో అఫ్ఘన్లు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు ఇప్పుడు అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి.. కీలకస్థానాల్లో ఉన్న నేతలే అలకబూనడం తాలిబన్లకు సమస్యగా మారింది.. అయితే, తాలిబన్ల కేబినెట్లో ఉన్నవారంతా కరడుగట్టిన ఉగ్రవాదులే.. హక్కానీ నెట్వర్క్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు… అయితే, కేబినెట్లో చోటు విషయంలో ఆచరణవాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం సాగింది.. ఇరు వర్గాల మధ్య దేశాధ్యక్ష భవనంలో పెద్ద గొడవ జరిగిందని.. ఆ ఘర్షణలో ఆచరణవాదుల వర్గానికి నేతృత్వం…
ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు శాంతియుత నిరసన చేస్తున్నారు. ఆఫ్ఘానిస్థాన్ లో జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ అఫ్ఘానిస్థాన్ విద్యార్థుల నిరసన చేస్తున్నారు. తాలిబన్లు అరాచకాలు ను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు రక్షణ కల్పించాలి, ఐక్యరాజ్యసమితి లో తాలిబన్లు కు రాజ్యం ఆమోదం వద్దని, పంజ్ షీర్ పోరాటానికి మద్దతుగా శాంతి యుత నిరసన చేపట్టారు. పాకిస్థాన్ వెంటనే తాలిబన్లకు సహకారం ఆపాలి డిమాండ్ చేసారు. అయితే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్…
2001 ముందు వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ఖైదా ఆ తరువాత సైలెంట్ అయింది. తన ఉనికి చాటుకుంటున్నప్పటికీ పెద్దగా దాని గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 20 ఏళ్లు అ ఉగ్రవాద సంస్థ సైలెంట్గా ఉన్నది. కాగా, అమెరికా దళాలు తప్పుకోవడంతో మరలా తన ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అల్ఖైదా తిరిగి పుంజుకోవడానికి తాలిబన్లు సహకరిస్తున్నారని, పంజ్షీర్ ను వారి ఆధీనంలోకి…
అఫ్ఘన్లో అమెరికా బలగాల ఉపసంహరణతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టాలు, హింసకు…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచకాలు మొదలయ్యాయి. నడిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయడం మొదలుపెట్టారు. రాజధాని కాబూల్లో భారత వ్యాపారి బన్సరీలాల్ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బన్సరీలాల్ కాబూల్లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఓ కారులో వచ్చిన దుండగులు బన్సరీలాల్ కారును ఢీకొట్టారు. అనంతరం వ్యాపారిని, ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అయితే, సిబ్బంది తప్పించుకొని…