Pakistan: భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల, ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు.
Afghanistan: అఫ్గానిస్తాన్లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అకస్మిక వరదలు సంభవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో మరో 11 మంది గాయపడినట్లు అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ANDMA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న కరువుకు తొలి భారీ వర్షాలు ముగింపు పలికినప్పటికీ.. ఈ సమయంలో వచ్చిన వరదలు ప్రజల్ని తీవ్రంగా కలవరపెట్టాయి. OTR: నల్గొండ కాంగ్రెస్ రచ్చ.. డిసిసి పీట పై ఉక్కుపాదం అక్కడి…
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ 2026లో అఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇదే జట్టు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్లో కూడా పాల్గొననుంది. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులోకి అనుభవజ్ఞులైన ఆల్రౌండర్ గుల్బదిన్ నయిబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి…
Taliban: పాకిస్తాన్కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాలిబన్లతో ఆచరణాత్మక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు.
Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.
ఆఫ్ఘనిస్థాన్పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్తో టూ-ఫ్రంట్ వార్కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది.