శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణమని.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.