Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్పై జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
- సీఎం రేవంత్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
- ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణమని.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.మేము అదానీ, రేవంత్ ఉన్న టీ షర్ట్ వేసుకుని సభకు పోతే తప్పేమిటని ప్రశ్నించారు. మేము ఏ బట్టలు వేసుకుని రావాలనేది స్పీకర్ చెబుతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
పార్లమెంట్లో రోజూ రాహుల్ అదానీ దుర్మార్గాల మీదనే మాట్లాడుతున్నారని.. ఇక్కడ రేవంత్ అదానీని వెనుకేసుకు వస్తున్నారని అన్నారు. అదానీకి తెలంగాణ సంపద దోచిపెట్టేందుకు రేవంత్ కుట్ర పన్నాడని ఆరోపించారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమేనని ఆరోపణలు చేశారు. రాహుల్ కూడా అదానీ టీ షర్ట్ ధరిస్తే పార్లమెంటులోకి అనుమతించారు.. ఇక్కడ ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీనే మేము అనుసరించామన్నారు. ఉభయ సభలు రేవంత్ నడువుతున్నారా.. స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ నడుపుతున్నారో చెప్పాలన్నారు. రాహుల్ది ఒప్పు అయితే మేము చేసింది తప్పని స్పీకర్, ఛైర్మన్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను బీఆర్ఎస్ సభలో లేవనెత్తకుండా చేయాలని ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుందన్నారు. తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9న ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు.
Also Read
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
Read Also: Farmers Protest: మిల్లులో పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రోడ్డుపై బైఠాయించిన రైతులు
ఈ రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని.. ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా చేయడం మా హక్కులను కాలరాయడమేనని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనా చారి అన్నారు. స్పీకర్, ఛైర్మన్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకకూడదన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారని.. ప్రభుత్వం ఉన్నట్టు లేదన్నారు. సీఎం పదవికున్న స్థాయిని రేవంత్ దిగజార్చారని విమర్శించారు. రేవంత్కు అహంకారం, అభద్రత రెండూ పెరిగిపోయాయని మధుసూదనా చారి అన్నారు.
తాజావార్తలు
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!