ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీ రోల్ పోషించిన పేర్లు వినిస్తున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రోజు తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు తనను నిజాయితీపరుడని తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్నాయి. రెండు రోజుల తర్వాత రాజకీనామా చేయాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడే చేయొచ్చు కదా.. అంటూ సెటైర్లు వేస్తున్నాయి.
Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య సీట్ల పంపకాల వివాదంలో పొత్తు విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రెండు పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇది మాత్రమే కాదు. ఆప్ తన మొదటి జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ చర్య భారత కూటమిలోని రెండు పార్టీల మధ్య దూరం కూడా తీసుకురావచ్చని అంచనాలు వేస్తున్నారు.…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.