Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Creates Sensational Record In IPL: ఈ ఐపీఎల్ సీజన్లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్న ఈ ఆటగాడు.. ఆ జట్టుకే అత్యంత కీలక ఆటగాడిగా అవతరించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఓ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్ల్లో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగుల మార్క్ అందుకొని అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత పృథ్వీ షా(21 ఏళ్ల 169 రోజులు) 44 ఇన్నింగ్స్ల్లో, సంజూ శాంసన్(21 ఏళ్ల 183 రోజులు) 44 ఇన్నింగ్స్ల్లో, శుభ్మన్ గిల్(21 ఏళ్ల 222 రోజులు) 41 ఇన్నింగ్స్ల్లో, దేవదత్ పడిక్కల్(21 ఏళ్ల 285 రోజులు) 35 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు.
Rakshita Suresh: ప్రముఖ సింగర్కి తప్పిన ప్రమాదం.. చావు అంచులదాకా వెళ్లి..
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. చివర్లో నో బాల్ వేయడంతో.. చేజారిన ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సొంతం అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. చివర్లో సందీప్ శర్మ నో బాల్ వేయడంతో, హైదరాబాద్ జట్టుకి ఒక ఎక్స్ట్రా బంతితో పాటు ఫ్రీ హిట్ కలిసొచ్చింది. దాన్ని అబ్దుల్ సమద్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. సిక్సర్ కొట్టాడు. ఫలితంగా.. ఎస్ఆర్హెచ్ గెలుపొందింది.
Yuzvendra Chahal: చాహల్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్లో తొలి భారత బౌలర్గా..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!