WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India WTC Points Table 2026: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లో 206 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 165 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం భారత్ 10 టెస్టుల్లో 5 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాను చేసుకుంది. 64 పాయింట్లు, 53.33 పర్సంటేజ్ పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే 53.33 శాతం పాయింట్లతో టాప్-4కు చేరువైంది. ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. శ్రీలంక 33.33 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 24.36 శాతం, పాకిస్థాన్ 22.22 శాతం, వెస్టిండీస్ 20.83 శాతం పాయింట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంకపై తొలి టెస్టులో సాధించిన విజయం భారత్కు సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందించడంతో పాటు డబ్ల్యూటీసీపాయింట్ల పట్టికలోనూ కీలకంగా మారింది. టాప్-4లోకి చేరాలంటే భారత్ మిగిలిన మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.
Also Read
- Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
- Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
- MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
- Rohit Sharma-Team India: అగార్కర్తో విభేదాలు.. గంభీర్పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
గాలె టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 230 బంతుల్లో 167 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా.. ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 39 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువంత మూడు వికెట్లు, అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులు చేసింది. సోనల్ దినూష శతకం (100) చేయగా.. నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులతో రాణించాడు. శ్రీలంకను 284 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 69 బంతుల్లో 66 పరుగులు బాదాడు. దేవదత్ పడిక్కల్ 44, కేఎల్ రాహుల్ 35 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు తీశాడు.
372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 59 పరుగులతో పోరాడగా.. సోనల్ దినూష 84 పరుగులతో పోరాడే ప్రయత్నం చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక ఓటమి తప్పలేదు. మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో సుతార్ 10 వికెట్లతో భారత విజయంలో కీలకంగా నిలిచాడు.
తాజావార్తలు
-
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
-
Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..
-
Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
-
China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్కు ముప్పు ఎంత?
-
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!