WPL2023 :RCB ఓటమికి నేనే కారణం, హాట్ కామెంట్స్ చేసిన స్మృతి మంధాన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో బెంగళూరు జట్టును ఓటములు వెంటాడుతున్నాయి. ఆ టీమ్ ఖాతా తెరవలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఆర్సీబీ ఓటమికి తనదే బాధ్యత అని హాట్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్మృతి మంధాన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Aslo Read : JanaSena: మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం..
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
గత నాలుగు మ్యాచ్ లుగా ఇదే కొనసాగుతుంది. ఆడిన ప్రతీ మ్యాచ్ లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత నుంచి వికెట్లు కోల్పోతున్నామని స్మృతి మంధాన తెలిపారు. అదే మా మ్యాచ్ లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. అంతే కాకుండా మా గేమ్ ప్లాన్ కూడా సరిగా లేనందున వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయామని స్మృతి వెల్లడించింది. అందుకే ఓటములకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని పేర్కొంది. ఒక బ్యాటర్ గా తాను పూర్తిగా ఫెయిలవుతున్నా.. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉందన్నారు. ఓటములతో గడిచిన వారం మాకు చాలా కష్టంగా అనిపించిందని స్మృతి మంధాన తెలిపారు. ఇక తన ఫ్యామిలీ ఎప్పుడు తనకు అండగా ఉంటుందన్నారు. ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరి చేసుకోవడమేనని స్మృతి మంధాన పేర్కొన్నారు.
Aslo Read : Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
మరోవైపు శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా మారగా..
సోపీ డివైన్ 36 పరుగులు చేసింది. ఇక మిగిలిన జట్టు సభ్యులు మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అటు యూపీ వారియర్స్ బౌలర్ ఎసెల్ స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లను పడగొట్టింది. ఇక యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు.. 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హీలీ ( 47 బంతుల్లో 96 నాటౌట్ గా నిలిచి.. 18 ఫోర్లు, ఒక సిక్సర్)బాదింది.. దేవికా వైద్య 36 పరుగులను సాధించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!