WPL2023 :RCB ఓటమికి నేనే కారణం, హాట్ కామెంట్స్ చేసిన స్మృతి మంధాన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో బెంగళూరు జట్టును ఓటములు వెంటాడుతున్నాయి. ఆ టీమ్ ఖాతా తెరవలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఆర్సీబీ ఓటమికి తనదే బాధ్యత అని హాట్ కామెంట్స్ చేశారు. మ్యాచ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్మృతి మంధాన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Aslo Read : JanaSena: మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం..
Also Read
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
గత నాలుగు మ్యాచ్ లుగా ఇదే కొనసాగుతుంది. ఆడిన ప్రతీ మ్యాచ్ లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత నుంచి వికెట్లు కోల్పోతున్నామని స్మృతి మంధాన తెలిపారు. అదే మా మ్యాచ్ లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. అంతే కాకుండా మా గేమ్ ప్లాన్ కూడా సరిగా లేనందున వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయామని స్మృతి వెల్లడించింది. అందుకే ఓటములకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని పేర్కొంది. ఒక బ్యాటర్ గా తాను పూర్తిగా ఫెయిలవుతున్నా.. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉందన్నారు. ఓటములతో గడిచిన వారం మాకు చాలా కష్టంగా అనిపించిందని స్మృతి మంధాన తెలిపారు. ఇక తన ఫ్యామిలీ ఎప్పుడు తనకు అండగా ఉంటుందన్నారు. ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరి చేసుకోవడమేనని స్మృతి మంధాన పేర్కొన్నారు.
Aslo Read : Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
మరోవైపు శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా మారగా..
సోపీ డివైన్ 36 పరుగులు చేసింది. ఇక మిగిలిన జట్టు సభ్యులు మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అటు యూపీ వారియర్స్ బౌలర్ ఎసెల్ స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లను పడగొట్టింది. ఇక యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు.. 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హీలీ ( 47 బంతుల్లో 96 నాటౌట్ గా నిలిచి.. 18 ఫోర్లు, ఒక సిక్సర్)బాదింది.. దేవికా వైద్య 36 పరుగులను సాధించింది.
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!