Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
Read Also: Ram Charan: ఇది మావా సక్సస్ అంటే… పదేళ్లలో ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ అనిపించాడు
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా భారత్ ను తమ మిత్రదేశం అని, ఆ తరువాత పొరుగు దేశం అంటూ తడబడ్డారు. కాశ్మీర్, పాలస్తీనా మధ్య సంబంధం ఉందని, రెండు కూడా ఇకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా భారత దేశాన్ని ఉద్దేశిస్తూ.. మన పొరుగుదేశం దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతోందని, కల్లబొల్లి మాటలు చెబుతోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివాదం కాదని, ఇది అంతర్జాతీయ వివాదాస్పద ప్రాంతం కాదని వాదిస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. కాశ్మీర్, పాలస్తీనా సమస్యలను యూఎన్ పరిష్కరించలేదని ఆయన అన్నారు. భద్రతా మండలి అయిన ఇతర ఏ వేదికపై అయినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని భుట్టో కోరారు.
ఇదిలా ఉంటే ఎజెండాతో సంబంధం లేకుండా పాకిస్తాన్, భారత్ పై విమర్శలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించాలని కోెరుతోంది. అయితే చాలా సార్లు పాకిస్తాన్ కు ధీటుగానే భారత్ బదులు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేసింది. ముందు మీ దేశ పరిస్థితిని చూసుకోండి అని హితవు పలికింది. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత నుంచి భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!