Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
Read Also: Ram Charan: ఇది మావా సక్సస్ అంటే… పదేళ్లలో ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ అనిపించాడు
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా భారత్ ను తమ మిత్రదేశం అని, ఆ తరువాత పొరుగు దేశం అంటూ తడబడ్డారు. కాశ్మీర్, పాలస్తీనా మధ్య సంబంధం ఉందని, రెండు కూడా ఇకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా భారత దేశాన్ని ఉద్దేశిస్తూ.. మన పొరుగుదేశం దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతోందని, కల్లబొల్లి మాటలు చెబుతోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివాదం కాదని, ఇది అంతర్జాతీయ వివాదాస్పద ప్రాంతం కాదని వాదిస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. కాశ్మీర్, పాలస్తీనా సమస్యలను యూఎన్ పరిష్కరించలేదని ఆయన అన్నారు. భద్రతా మండలి అయిన ఇతర ఏ వేదికపై అయినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని భుట్టో కోరారు.
ఇదిలా ఉంటే ఎజెండాతో సంబంధం లేకుండా పాకిస్తాన్, భారత్ పై విమర్శలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించాలని కోెరుతోంది. అయితే చాలా సార్లు పాకిస్తాన్ కు ధీటుగానే భారత్ బదులు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేసింది. ముందు మీ దేశ పరిస్థితిని చూసుకోండి అని హితవు పలికింది. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత నుంచి భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!