JanaSena: మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JanaSena: జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవ పడటానికి కార్పొరేషన్లు ఉపయోగ పడ్డాయని ఎద్దేవా చేశారు.. నవరత్నాల పేరుతో బీసీలకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు.. ఏ పథకం కావాలని అడిగినా.. నవరత్నాల్లో ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. బీసీ సాధికారిత కలిగే విధంగా జనసేన గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని.. బీసీలంతా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా చెప్పుకొచ్చారు మనోహర్.
Read Also: Revanth Reddy: ఈడీ తలచుకుంటే.. కవితని గంటలోపే జైలుకి పంపొచ్చు
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
చేపల వేట నిషేధం సమయంలో రూ. 10 వేలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. నలభై శాతం మందికి కూడా ఈ సాయం అందలేదని ఆరోపించారు నాదెండ్ల మనోహర్.. కొంతమంది బీసీ జనగణన గురించి ఏదేదో మాట్లాడతారు.. బీసీ జనగణన జరగాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు…ఈ సమావేశంలో మీ అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పాలని కోరారు.. పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకుంటే.. జనసేన అధికారంలోకి రాగానే వారికి ఉచిత విద్యుత్ అందిస్తాం అన్నారు. బీసీలను వైఎస్ జగన్ ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆలోచన చేయండి.. చేతి వృత్తి మీద ఆధారపడిన వారందరూ అభివృద్ధి కావాలనేదే పవన్ కల్యాణ్ కోరిక.. బీసీలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!