WPL 2026 Final: గ్రేస్ ఆల్రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఆర్సీబీ!
- గ్రేస్ హారిస్ ఆల్రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్
- డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్కు ఆర్సీబీ
- యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ.. యూపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్జ్కు ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్ (41), దీప్తి శర్మ (55) మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నడిన్ డి క్లర్క్ విడదీసింది. లానింగ్ ఔటైన తర్వాత యూపీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకవైపు దీప్తి శర్మ ఒంటరి పోరాటంతో అర్ధశతకం పూర్తి చేసినా, మరో ఎండ్లో సహకారం కరువైంది. అమీ జోన్స్ (1), హర్లీన్ డియోల్ (14), క్లో ట్రయాన్ (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో యూపీ వేగంగా వికెట్లు కోల్పోయింది.
Also Read
- Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
- FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
- SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
- IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
ఆర్సీబీ బౌలర్లలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ నడిన్ డి క్లర్క్ అద్భుతంగా రాణించింది. కేవలం 22 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి యూపీ పతనాన్ని శాసించింది. ఆమె ధాటికి యూపీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. గ్రేస్ హారిస్ రెండు వికెట్లు, లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీయడంతో యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
144 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు గ్రేస్ హారిస్ (75), కెప్టెన్ స్మృతి మంధాన (54) ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి ఓవర్ నుంచే యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ విధ్వంసకర బ్యాటింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వీరిద్దరూ తొలి వికెట్కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. హారిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జార్జియా వోల్ (16)తో కలిసి మంధాన ఇన్నింగ్స్ను నడిపించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన మంధాన, తర్వాత గేరు మార్చి కేవలం 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ కేవలం 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్కు అర్హత సాధించింది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!