WPL 2026 Final: గ్రేస్ ఆల్రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఆర్సీబీ!
- గ్రేస్ హారిస్ ఆల్రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్
- డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్కు ఆర్సీబీ
- యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ.. యూపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్జ్కు ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్ (41), దీప్తి శర్మ (55) మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నడిన్ డి క్లర్క్ విడదీసింది. లానింగ్ ఔటైన తర్వాత యూపీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకవైపు దీప్తి శర్మ ఒంటరి పోరాటంతో అర్ధశతకం పూర్తి చేసినా, మరో ఎండ్లో సహకారం కరువైంది. అమీ జోన్స్ (1), హర్లీన్ డియోల్ (14), క్లో ట్రయాన్ (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో యూపీ వేగంగా వికెట్లు కోల్పోయింది.
Also Read
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
- Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
ఆర్సీబీ బౌలర్లలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ నడిన్ డి క్లర్క్ అద్భుతంగా రాణించింది. కేవలం 22 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి యూపీ పతనాన్ని శాసించింది. ఆమె ధాటికి యూపీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. గ్రేస్ హారిస్ రెండు వికెట్లు, లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీయడంతో యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
144 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు గ్రేస్ హారిస్ (75), కెప్టెన్ స్మృతి మంధాన (54) ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి ఓవర్ నుంచే యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా గ్రేస్ హారిస్ విధ్వంసకర బ్యాటింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వీరిద్దరూ తొలి వికెట్కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. హారిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జార్జియా వోల్ (16)తో కలిసి మంధాన ఇన్నింగ్స్ను నడిపించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన మంధాన, తర్వాత గేరు మార్చి కేవలం 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ కేవలం 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్కు అర్హత సాధించింది.
తాజావార్తలు
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?