Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు తన తదుపరి పర్యటనలో భాగంగా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో సారాంశ్ జైన్కు తొలిసారి అవకాశం దక్కగా, మిగిలిన జట్టులో పాత ముఖాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. దీనికి ముందు ఆగస్టు 7 నుంచి భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
అయితే ఈ ఎంపికలో ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేరు ఈ జాబితాలో లేకపోవడంతో ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగిసిందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉన్న షమీ, రంజీల్లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు ఆయన వైపు మొగ్గు చూపలేదు. అలాగే రెడ్ బాల్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్న రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటీదార్లకు కూడా నిరాశే ఎదురైంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ డార్ను ఎంపిక చేయలేదు. ఇక గతంలో ఫిట్నెస్ సాధించి బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్ను మళ్లీ పక్కన పెట్టారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
సెలెక్టర్లు ప్రకటించిన ఈ టెస్ట్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపడతారు. జట్టులో యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్ సభ్యులుగా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్ట్కు అందుబాటులో లేరని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రాలు తుది జట్టులో ఆడటం అనేది బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఇచ్చే ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికే బుమ్రా ఫట్ నెస్ సాధించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తుది జట్టులో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?