WPL 2023 : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు చరత్ర రిపీట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్సీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం ( మార్చ్ 26 ) జరిగే ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనుంది. అయితే పురుషుల తొలి సీజన్ ఐపీఎల్ అడుగుజాడల్లో WPL ముగింపు దశ కూడా నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రపంచంలోనే ఎంతో మందిని ఆకర్షించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. అయితే ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వెంటవెంటనే ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్ పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే WPL మొదలైంది.
Also Read : Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా’.. పీఎస్వీ కిషన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
Also Read
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
అచ్చం ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ముంబయితో తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును పైనల్ చేర్చింది. లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్ లు గెలిచింది.
Also Read : Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం గమనించాల్సి ఉంది మీరు.. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ చేరిన జట్లు ఏవో మీకు గుర్తుకు ఉండి ఉంటాయి. అయినా సరే మరోసారి గుర్తు చేస్తాను.. రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కి అప్పటి టీమిండియా కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తుండగా రాజస్థాన్ కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు WPL ఫైనల్ లో కూడా ముంబయికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా ఉండగా.. ఢిల్లీకి ఆసీస్ కెప్టెన్ లానింగ్ సారథ్యం వహిస్తుంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా.. లేక హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!