WPL 2023 : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు చరత్ర రిపీట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్సీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం ( మార్చ్ 26 ) జరిగే ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనుంది. అయితే పురుషుల తొలి సీజన్ ఐపీఎల్ అడుగుజాడల్లో WPL ముగింపు దశ కూడా నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రపంచంలోనే ఎంతో మందిని ఆకర్షించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. అయితే ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వెంటవెంటనే ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్ పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే WPL మొదలైంది.
Also Read : Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా’.. పీఎస్వీ కిషన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
Also Read
- Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- Coaching Staff: భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్లో మార్పులు.. ఆ ఇద్దరికి బీసీసీఐ స్వస్తి..
అచ్చం ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ముంబయితో తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును పైనల్ చేర్చింది. లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్ లు గెలిచింది.
Also Read : Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం గమనించాల్సి ఉంది మీరు.. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ చేరిన జట్లు ఏవో మీకు గుర్తుకు ఉండి ఉంటాయి. అయినా సరే మరోసారి గుర్తు చేస్తాను.. రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కి అప్పటి టీమిండియా కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తుండగా రాజస్థాన్ కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు WPL ఫైనల్ లో కూడా ముంబయికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా ఉండగా.. ఢిల్లీకి ఆసీస్ కెప్టెన్ లానింగ్ సారథ్యం వహిస్తుంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా.. లేక హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!