Team India: విరాట్ కోహ్లీకి అక్టోబర్ సెంటిమెంట్.. సెంచరీ చేయడం ఖాయమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్లో మ్యాచ్లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ పాకిస్థాన్కు బ్యాట్తోనే సమాధానం చెప్తాడని భావిస్తున్నారు.
Read Also: IND Vs PAK: మెల్బోర్న్ వద్ద రచ్చ రచ్చ.. స్విమ్మింగ్ పోటీలైనా నిర్వహించాలని ఫ్యాన్స్ వినతి
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
గతంలో అక్టోబర్ 21న విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ ఆడగా 22వ తేదీ రెండు మ్యాచ్లు, 23వ తేదీ రెండు మ్యాచ్లు, 24వ తేదీ ఒక మ్యాచ్ ఆడాడు. ఆయా మ్యాచ్లలో విరాట్ కోహ్లీ దాదాపుగా సెంచరీతో చెలరేగాడు. 2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 86 పరుగులు నాటౌట్, 2015న అక్టోబర్ 22న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 138 పరుగులు, 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 154 పరుగులు, 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 140 పరుగులు, 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 157 పరుగులు నాటౌట్ స్కోర్లను విరాట్ కోహ్లీ చేశాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు విఫలమైన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో ఈరోజు జరిగే మ్యాచ్లోనూ కోహ్లీ రాణిస్తాడని అతడి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..