Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం
- చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- 2002లో ప్రారంభమైన కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్లో 23 ఏళ్లుగా కొనసాగిన విడాకుల కేసులో భారత సంతతికి చెందిన మహిళకు భారీ విజయం లభించింది. కోర్టు ఆమెకు 6.6 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.85 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో, యూకే న్యాయ చరిత్రలో అత్యంత సుదీర్ఘ విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ వివాదానికి ముగింపు లభించింది.
2002లో ప్రారంభమైన కేసు
వర్షా గోహిల్ అనే మహిళ 2002లో తన భర్త భద్రేష్ గోహిల్పై విడాకుల కోసం దరఖాస్తు చేశారు. భర్త వివాహేతర సంబంధాలు, అనుచిత ప్రవర్తన కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఇరు పక్షాలు ఒక ఆర్థిక ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారం వర్షా గోహిల్కు 2.7 లక్షల పౌండ్లు (సుమారు రూ.3.5 కోట్లు), కుటుంబానికి చెందిన కారును ఇచ్చారు. అయితే తన భర్త ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే అనుమానం ఆమెకు అప్పటి నుంచే ఉండేది.
Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
మనీలాండరింగ్ కేసుతో బయటపడిన ఆస్తులు
కొన్ని సంవత్సరాల తర్వాత భద్రేష్ గోహిల్ భారీ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. నైజీరియాకు చెందిన మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో సంబంధాలున్న ఆర్థిక అక్రమాల్లో ఆయన పాత్ర ఉందని అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భద్రేష్ గోహిల్ విదేశీ కంపెనీలు, ఇతర మార్గాల ద్వారా కోట్లాది పౌండ్ల ఆస్తులను దాచిపెట్టినట్లు బయటపడింది. అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్ర కేసుల్లో దోషిగా తేలడంతో ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
సుప్రీంకోర్టు వరకు వెళ్లిన వివాదం
భర్త తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని వర్షా గోహిల్ వాదిస్తూ అసలు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు చివరకు యూకే సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2015లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇస్తూ, విడాకుల సమయంలో ఆస్తులను దాచిపెట్టిన వ్యక్తి ఆ తప్పిదం వల్ల లాభపడకూడదని స్పష్టం చేసింది. దీంతో కేసును తిరిగి విచారించేందుకు మార్గం సుగమమైంది.
రూ.85 కోట్ల పరిహారం
తాజాగా హైకోర్టు విచారణలో భద్రేష్ గోహిల్కు చెందిన కొన్ని ఆస్తులు చట్టబద్ధమైనవేనని గుర్తించింది. వాటిలో వర్షా గోహిల్కు హక్కు ఉందని నిర్ణయిస్తూ 6.6 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.85 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. భద్రేష్ గోహిల్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా విమర్శిస్తూ, ఆయనను “పూర్తిగా నిజాయితీ లేని వ్యక్తి”గా అభివర్ణించింది. అనంతరం యూకే అప్పీల్ కోర్టు కూడా ఇకపై ఎలాంటి అప్పీల్స్కు అవకాశం లేదని స్పష్టం చేయడంతో 23 ఏళ్ల న్యాయపోరాటానికి తెరపడింది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..