RCB vs CSK: ధోనీ చేసిన పెద్ద తప్పు.. థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం.. ఆర్సీబీకి అన్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Third Umpire Ignore MS Dhoni Big Mistake in RCB vs CSK Match: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీపింగ్ విషయంలో ఎంత ప్రావీణ్యుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బ్యాటర్ను దాటి బంతి తన చేతికి దొరికిందంటే చాలు.. కనురెప్పపాటులోనే బెయిల్స్ ఎగిరిపోతాయి. తన కీపింగ్ స్కిల్స్తో ధోనీ ఎన్నో మ్యాచెస్ని మలుపు తిప్పాడు. అలాంటి ధోనీ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చాలా పెద్ద తప్పు చేశాడు. దాన్ని థర్డ్ అంపైర్ కూడా గుర్తించకపోవడంతో.. నెట్టింట్లో అది చర్చకు దారితీసింది. ఆర్సీబీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ తప్పేంటంటే..
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
- CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..

15వ ఓవర్లో జడేజా వేసిన ఐదో బంతిని ఆర్సీబీ బ్యాటర్ కార్తిక్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది మిస్ అయి, వెనుక ఉన్న ధోనీ చేతిలోకి వెళ్లింది. అప్పుడు ధోనీ వెంటనే బెయిల్స్ ఎగరగొట్టాడు. ఇది ఔటో, కాదో తేల్చేందుకు.. థర్డ్ అంపైర్ను ఫీల్డ్ అంపైర్ ఆశ్రయించగా, అది నాటౌట్గా తేలింది. ఇక్కడే థర్ట్ అంపైర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ధోనీ చేసిన అది పెద్ద తప్పును వదిలేశాడు. ఇంతకీ ఆ తప్పేంటంటే.. ధోనీ ఆ బంతిని ‘స్టంప్ లైన్’కి ముందే అందుకోవడం. నిబంధనల ప్రకారం.. స్టంప్ లైన్ని పాస్ అయిన తర్వాతే బంతిని కీపర్ అందుకోవాలి. ఒకవేళ ఈ నిబంధనని ఉల్లంఘిస్తే.. దానిని నో-బాల్గా పరిగణిస్తారు. ఇక్కడ ధోనీ ఆ బంతిని స్టంప్లైన్ ముందే తీసుకోవడం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయాన్ని గమనించలేదు. దీంతో.. ఆర్సీబీకి నోబాల్ అవకాశం మిస్ అయింది.
Heatwave in India: దేశంలో అత్యంత వేడిగా ఉండే నగరాలు ఇవే !
ఒకవేళ థర్ట్ అంపైర్ ఆ విషయాన్ని గమనించి ఉంటే.. ఆర్సీబీ ఖాతాలోకి నో-బాల్ వచ్చి ఉండేది. అప్పుడు పరిస్థితులు తప్పకుండా వేరేలా ఉండేవి. ఎందుకంటే.. అప్పటికే కార్తిక్ మంచి జోష్లో ఉన్నాడు. పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటప్పుడు నో-బాల్ ఛాన్స్ వచ్చి ఉంటే.. ఒక బంతి ఎక్స్ట్రాగా వచ్చేది. తద్వారా ఫలితాల్లో మార్పులు వచ్చి ఉండేవి. కానీ.. థర్ట్ అంపైర్ ధోనీ చేసిన తప్పును గమనించకపోవడంతో ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ‘‘థర్డ్ అంపైర్ సీఎస్కే తరపున అనుకూలంగా ఉన్నట్టున్నాడు.. అందుకే నోబాల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కచ్చితంగా ఆర్సీబీ గెలిచి ఉండేది’’ అంటూ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!