Heatwave in India: దేశంలో అత్యంత వేడిగా ఉండే నగరాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో తీవ్రమైన వేసవి కాలం కొనసాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఏప్రిల్ 18,19 తేదీలలో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ రోజు వాతావరణ కార్యాలయం యొక్క జాబితాలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రయాగ్రాజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశాలోని బరిపాడలో 44.2 డిగ్రీలతో రెండో స్థానంలో నిలిచింది. ఝాన్సీ (43.6), బౌధ్ (43.5), డాల్తోన్గంజ్ (43.4), ఝర్సుగూడ (43.4), పాట్నా (43.2 ), ఖజురహో (43.2) సంబల్పూర్ (43.2 ) , శ్రీనికేతన్ (43.2) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఐఎండి తెలిపింది.
Also Read
Also Read: Extramarital Affair: అల్లుడితో లాడ్జ్కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు. బుధవారం మేఘావృతమైన వాతావరణం మరియు తేలికపాటి వర్షం ఢిల్లీలో వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD అంచనా వేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్లు పెరిగే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది. వచ్చే 4 రోజులలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని IMD తెలిపింది. ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమంలో 13 మంది వడదెబ్బతో మృతి చెందారు.
పంజాబ్, హర్యానా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హర్యానా , పంజాబ్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. పంజాబ్లోని భటిండాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పశ్చిమ బెంగాల్లో నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు ఉంటాయన్న ఐఎండి హెచ్చరికతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను శనివారం వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. రాష్ట్రంలో వేడిగాలుల వంటి పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుండి 23 వరకు అన్ని ప్రభుత్వ, రాష్ట్ర సహాయ పాఠశాలలను మూసివేయనున్నట్లు త్రిపుర తెలిపింది. గతంలో ఒడిశా కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!