Heatwave in India: దేశంలో అత్యంత వేడిగా ఉండే నగరాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో తీవ్రమైన వేసవి కాలం కొనసాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఏప్రిల్ 18,19 తేదీలలో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ రోజు వాతావరణ కార్యాలయం యొక్క జాబితాలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రయాగ్రాజ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశాలోని బరిపాడలో 44.2 డిగ్రీలతో రెండో స్థానంలో నిలిచింది. ఝాన్సీ (43.6), బౌధ్ (43.5), డాల్తోన్గంజ్ (43.4), ఝర్సుగూడ (43.4), పాట్నా (43.2 ), ఖజురహో (43.2) సంబల్పూర్ (43.2 ) , శ్రీనికేతన్ (43.2) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఐఎండి తెలిపింది.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
Also Read: Extramarital Affair: అల్లుడితో లాడ్జ్కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు. బుధవారం మేఘావృతమైన వాతావరణం మరియు తేలికపాటి వర్షం ఢిల్లీలో వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD అంచనా వేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్లు పెరిగే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది. వచ్చే 4 రోజులలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని IMD తెలిపింది. ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమంలో 13 మంది వడదెబ్బతో మృతి చెందారు.
పంజాబ్, హర్యానా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హర్యానా , పంజాబ్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. పంజాబ్లోని భటిండాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పశ్చిమ బెంగాల్లో నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు ఉంటాయన్న ఐఎండి హెచ్చరికతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను శనివారం వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. రాష్ట్రంలో వేడిగాలుల వంటి పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుండి 23 వరకు అన్ని ప్రభుత్వ, రాష్ట్ర సహాయ పాఠశాలలను మూసివేయనున్నట్లు త్రిపుర తెలిపింది. గతంలో ఒడిశా కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది.
తాజావార్తలు
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!