నిన్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఓటమి చెందిన విషయం తెల్సిందే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ క్రికెట్ లవర్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ పై, ఇన్స్టా గ్రామ్లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్ తీసుకో. పాకిస్తాన్ వెళ్లిపో బొసిడికే అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా షమీ నిన్నటి మ్యాచ్లో 3.5 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ ఓడిపోవడానికి ఈ రన్స్ కారణమంటూ షమీ పై నెటిజన్లు తమదైనా రీతిలో ట్రోల్స్ చేస్తున్నారు.