Rohit Sharma: నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది చెప్పను: రోహిత్ శర్మ
Rohit Sharma Said I definitely wanted four spinners in Team India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఎందుకనే కారణాన్ని ఇప్పుడు చెప్పలేనన్నాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని యుఎస్లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో చెబుతా అని రోహిత్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించింది. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాని ఓ రిపోర్టర్ అడగ్గా.. కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు. ‘ఈ విషయంపై నేను లోతుగా వెళ్లదలచుకోలేదు. జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలని నేను బలంగా కోరుకున్నా. వెస్టిండీస్లో మేం చాలా క్రికెట్ ఆడాం. మ్యాచ్ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడంలో సాంకేతిక కోణం ఉంది. నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది ఇప్పుడే చెప్పను. బహుశా నేను యుఎస్లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తా. నలుగురిలో ఇద్దరు ఆల్రౌండర్లు. ఇది జట్టుకు సమతూకాన్నిస్తుంది’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
Also Read: Ajit Agarkar: అందుకే సంజూ శాంసన్ను ఎంచుకున్నాం: అజిత్ అగార్కర్
మిడిల్ ఓవర్లలో జట్టు అవసరాలపై చాలా దృష్టిపెట్టామని రోహిత్ శర్మ తెలిపాడు. ‘మేం మిడిల్ ఓవర్ల హిట్టింగ్పై దృష్టిపెట్టాం. అందుకే శివమ్ దూబెను ఎంపిక చేశాం. టాప్ ఆర్డర్ హిట్టింగ్ ఫర్వాలేదు. మరీ అంత పేలవంగా ఏమీ లేదు. ప్రపంచకప్ కోసం 2024 15 మంది ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. కొన్ని స్థానాల కోసమే ఐపీఎల్ 2024 వరకు ఆగాం. మంచి జట్టును ఎంపిక చేశాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!