Rohit Sharma: నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది చెప్పను: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Said I definitely wanted four spinners in Team India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఎందుకనే కారణాన్ని ఇప్పుడు చెప్పలేనన్నాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని యుఎస్లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో చెబుతా అని రోహిత్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) బీసీసీఐ ప్రకటించింది. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాని ఓ రిపోర్టర్ అడగ్గా.. కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు. ‘ఈ విషయంపై నేను లోతుగా వెళ్లదలచుకోలేదు. జట్టులో నలుగురు స్పిన్నర్లు కావాలని నేను బలంగా కోరుకున్నా. వెస్టిండీస్లో మేం చాలా క్రికెట్ ఆడాం. మ్యాచ్ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడంలో సాంకేతిక కోణం ఉంది. నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది ఇప్పుడే చెప్పను. బహుశా నేను యుఎస్లో జరిగే మొదటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తా. నలుగురిలో ఇద్దరు ఆల్రౌండర్లు. ఇది జట్టుకు సమతూకాన్నిస్తుంది’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Ajit Agarkar: అందుకే సంజూ శాంసన్ను ఎంచుకున్నాం: అజిత్ అగార్కర్
మిడిల్ ఓవర్లలో జట్టు అవసరాలపై చాలా దృష్టిపెట్టామని రోహిత్ శర్మ తెలిపాడు. ‘మేం మిడిల్ ఓవర్ల హిట్టింగ్పై దృష్టిపెట్టాం. అందుకే శివమ్ దూబెను ఎంపిక చేశాం. టాప్ ఆర్డర్ హిట్టింగ్ ఫర్వాలేదు. మరీ అంత పేలవంగా ఏమీ లేదు. ప్రపంచకప్ కోసం 2024 15 మంది ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. కొన్ని స్థానాల కోసమే ఐపీఎల్ 2024 వరకు ఆగాం. మంచి జట్టును ఎంపిక చేశాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!