టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టు ప్రదర్శన సగటు క్రికెట్ అభిమాను లను నిరాశ పర్చింది. దీంతో సెమీస్లో స్థానం దక్కించు కోవాలంటే పోరాడక తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్లిపోయింది భారత జట్టు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీంఇండియా ఈసారి అభిమానులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రస్తుతం భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ అద్భుతం జరగాలి.
ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్ చేరాలంటే స్కాంట్లాండ్పై, నవంబర్8న నమీబియాపై భారీ తేడా(80 పరుగుల తేడాతో లేదా12 ఓవర్లలో చేధన)తో గెలవాలి. ఇలా గెలిచిన కూడా న్యూజిలాండ్ జట్టు ఆప్ఘానిస్థాన్ చేతిలో తప్పనిసరిగి ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయిం ట్లతో ఉన్న న్యూజిలాండ్.. ఆప్ఘానిస్థాన్పై గెలిస్తే నేరుగా సెమీస్కు వెళ్తుంది. అప్పుడు భారత్, ఆప్ఘాన్ ఇంటిదారి పడతాయి. ఒకవేళ ఆప్ఘాన్ గెలిస్తే నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఇంతకముందే పాకిస్థాన్ సెమీస్ చేరగా, మరో జట్టుకు మాత్రమే సెమీస్ అవకాశాలు ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే ఈ అద్భుతం జరగాలి మరీ..