Rohit Sharma Retd Hurt: అందుకే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగా: రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on Retd Hurt in IND vs IRE Match: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి న్యూయార్క్లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రోహిత్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరడంతో.. అతడికి ఏమైంది?అని ఫాన్స్ ఆందోళనకు గురయ్యారు.
హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే రోహిత్ శర్మ 10వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన బంతి రోహిత్ భుజానికి బలంగా తాకింది. ఈ దెబ్బకు హిట్మ్యాన్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం నొప్పితోనే బ్యాటింగ్ చేసిన రోహిత్.. హాఫ్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. టీమిండియా ఫిజియోతో కలిసి అతడు మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ దీనిపై స్పందించాడు. భుజం కొద్దిగా నొప్పిగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా రిటైర్డ్ హర్ట్గా తాను వెనుదిరిగానని చెప్పాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs IRE: విజృంభించిన పేసర్లు.. ఐర్లాండ్పై భారత్ అలవోక విజయం!
రోహిత్ శర్మ మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయం కచ్చితంగా మాకు తెలియదు. టాస్ సమయంలో ఇదే విషయం చెప్పా. కొత్త స్టేడియంలో 5 నెలల కిందట తయారు చేసిన ఈ పిచ్పై ఎలా ఆడాలో తెలియదు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడం కోసం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ బౌలర్లకు అనుకూలించింది. అయితే క్రీజులో నిలదొక్కుకుంటే… పరుగులు చేయొచ్చు. ఈ మైదానంలో నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోవద్దు. మా తుది జట్టు ఎంపిక బ్యాలెన్సింగ్గా ఉండాలనుకుంటున్నాం. పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటే ఓ విధంగా, స్పిన్కు సహకరిస్తుందనుకుంటే మరో విధంగా ప్లేయింగ్ 11 ఉంటుంది. ఈ మ్యాచ్లో నలుగురు పేసర్లు, ఆల్రౌండర్లుగా ఉన్న ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నాం. మంచి పేస్ దళం ఉన్న పాకిస్థాన్ను ఎదుర్కోవడానికి మేం సన్నద్ధమవుతాం’ అని హిట్మ్యాన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!