CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
- ఢిల్లీలో రైతు నాయకుడు రాకేష్ టికాయత్తో సీజేపీ నేతల భేటీ.
- రైతులు, విద్యార్థులు, యువతకు ఉమ్మడి వేదిక ఏర్పాటు లక్ష్యంగా చర్చలు.
- విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు టికాయత్ మద్దతు కోరిన సీజేపీ.
- రైతులు, విద్యార్థులతో మోడీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాలన్న సీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఉద్యమం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు సీజేపీ మరో ప్లాన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్పై ఉద్యమించిందేకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు ఢిల్లీలో రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ను కలిశారు. రైతులు-విద్యార్థులు-యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలని భావిస్తున్నారు.
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ఇతర కాక్రోచ్ ప్రతినిధులు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకులతో కలిసి టికాయత్తో సమావేశమయ్యారు. భవిష్యత్తులో రైతులు, యువత కలిసి చేపట్టబోయే వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత రాంకా మాట్లాడుతూ.. ‘‘దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
Also Read
- Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
- Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
- Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై విద్యా సమస్యలతో పాటు రైతులు, యువత సమస్యల్ని కూడా ఉద్యమంలో భాగం చేయాలని సీజేపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నిరసన సమయంలో కేంద్ర ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని సీజేపీ ఆరోపించింది. బీహార్, యూపీలలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. విద్యార్థులపై నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలని టికాయత్ మద్దతు కోరినట్లు సీజేపీ తెలిపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
-
Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
-
Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!