ఐపీఎల్లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా చివరకు సురేష్ రైనాను వరించింది.
ఈ అవార్డు కోసం పోటీ పడిన వారిలో శ్రీలంక క్రికెట్ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్పోవెల్, డచ్ఫుట్బాల్ఆటగాడు ఎడ్గర్డెవిడ్స్ ఉన్నారు. ఈ అవార్డును రైనాకు బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. కాగా ఐపీఎల్వంటి మెగా టోర్నీలో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు కప్పు గెలవడంలో సురేష్ రైనా కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు.