BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
- సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఘటన
- గుండు గీయించుకున్న మహిళకు రూ.15 వేలు
- విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్టాప్
- పురుషులకైతే రూ.6 వేలు ఇస్తారని మాయమాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BE ALERT: తమిళనాడులో విక్రమార్కుడు సినిమా తరహా గుండు సీన్ రిపీట్ అయింది. ఓ ఆకతాయి.. మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఆశ చూపించాడు. తీరా సీన్ కట్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో గుండు చేసుకున్న మహిళలు కంగుతిన్నారు. అసలు ఇంతకు ఈ మోసం ఎక్కడ జరిగింది? మహిళలు ఏం చెబుతున్నారు? చూశారా..!! లచ్చిందేవి..లచ్చిందేవి.. అంటూ మాయమాటలతో బురిడీ కొట్టించి.. మహిళలందరికీ అరగుండు కొట్టించాడు హీరో రవితేజ. గుండు సగంలో ఆపేసి హీరో వెళ్లిపోతే.. ఆ తర్వాత ఆ మిగిలిన అరగుండు గీసేందుకు బ్రహ్మానందం వచ్చి.. మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఇదిగో ఇలా..!!
ఈ సినిమాలో తరహాలోనే సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్.. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని భయపెట్టాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారినపడిన మహిళలంతా గుండు గీయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారని మాయ మాటలు చెప్పాడు. కాబట్టి.. పుదుకొత్తంబాడిలో మహిళల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నాడు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
అంతటితో ఆగని.. ఆ వ్యక్తి.. అలా గుండు గీయించుకున్న మహిళలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే రూ.6వేలు చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపాడు. ఐతే ఇప్పటి వరకు కేవలం 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని.. రికార్డుల్లో పళనియమ్మాళ్ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అంతే కాకుండా తన మాటలపై అనుమానం రాకుండా ఉండేందుకు.. గుండు చేయించుకున్న మహిళల నకిలీ ఫొటోలతో పాటు రూ.500 నోట్ల కట్టల చిత్రాలను పళనియమ్మాళ్కు వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలను చూసి అది నిజమైన ప్రభుత్వ పథకమేనని ఆమె గుడ్డిగా నమ్మేసింది…..
పళనియమ్మాళ్ కాస్తా విషయాన్ని చుట్టుపక్కల మహిళలందరికీ చెప్పడంతో.. అంతా బార్బర్ను పిలిచి గుండు గీయించుకున్నారు. ఇందులో భాగంగా గుండు చేయించుకున్న కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు.. ప్రభుత్వం ప్రకటించిన డబ్బుల కోసం ఆ వ్యక్తి నంబర్కు కాల్ చేశారు. అతని మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో మహిళల మైండ్ బ్లాంక్ అయింది. నేరుగా అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తీవ్రంగా మోసపోయామని గ్రహించారు. ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు…స్పాట్..
- Tags
- Be Alert
- NTV Telugu
- Tamil Nadu
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!