BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
- సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఘటన
- గుండు గీయించుకున్న మహిళకు రూ.15 వేలు
- విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్టాప్
- పురుషులకైతే రూ.6 వేలు ఇస్తారని మాయమాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BE ALERT: తమిళనాడులో విక్రమార్కుడు సినిమా తరహా గుండు సీన్ రిపీట్ అయింది. ఓ ఆకతాయి.. మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఆశ చూపించాడు. తీరా సీన్ కట్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో గుండు చేసుకున్న మహిళలు కంగుతిన్నారు. అసలు ఇంతకు ఈ మోసం ఎక్కడ జరిగింది? మహిళలు ఏం చెబుతున్నారు? చూశారా..!! లచ్చిందేవి..లచ్చిందేవి.. అంటూ మాయమాటలతో బురిడీ కొట్టించి.. మహిళలందరికీ అరగుండు కొట్టించాడు హీరో రవితేజ. గుండు సగంలో ఆపేసి హీరో వెళ్లిపోతే.. ఆ తర్వాత ఆ మిగిలిన అరగుండు గీసేందుకు బ్రహ్మానందం వచ్చి.. మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఇదిగో ఇలా..!!
ఈ సినిమాలో తరహాలోనే సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్.. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని భయపెట్టాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారినపడిన మహిళలంతా గుండు గీయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారని మాయ మాటలు చెప్పాడు. కాబట్టి.. పుదుకొత్తంబాడిలో మహిళల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నాడు.
Also Read
అంతటితో ఆగని.. ఆ వ్యక్తి.. అలా గుండు గీయించుకున్న మహిళలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే రూ.6వేలు చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపాడు. ఐతే ఇప్పటి వరకు కేవలం 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని.. రికార్డుల్లో పళనియమ్మాళ్ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అంతే కాకుండా తన మాటలపై అనుమానం రాకుండా ఉండేందుకు.. గుండు చేయించుకున్న మహిళల నకిలీ ఫొటోలతో పాటు రూ.500 నోట్ల కట్టల చిత్రాలను పళనియమ్మాళ్కు వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలను చూసి అది నిజమైన ప్రభుత్వ పథకమేనని ఆమె గుడ్డిగా నమ్మేసింది…..
పళనియమ్మాళ్ కాస్తా విషయాన్ని చుట్టుపక్కల మహిళలందరికీ చెప్పడంతో.. అంతా బార్బర్ను పిలిచి గుండు గీయించుకున్నారు. ఇందులో భాగంగా గుండు చేయించుకున్న కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు.. ప్రభుత్వం ప్రకటించిన డబ్బుల కోసం ఆ వ్యక్తి నంబర్కు కాల్ చేశారు. అతని మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో మహిళల మైండ్ బ్లాంక్ అయింది. నేరుగా అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తీవ్రంగా మోసపోయామని గ్రహించారు. ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు…స్పాట్..
- Tags
- Be Alert
- NTV Telugu
- Tamil Nadu
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!