Team India Playing XI: జట్టులోకి గిల్ ఎంట్రీ- సంజూ ఔట్.. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే తుది జట్టు ఇదే
- రేపు కటక్లోని బారాబతి స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి టీ20..
- గిల్, హార్ధిక్ పాండ్యా రాకతో సంజూ, సుందర్, అర్శ్దీప్ సింగ్లు బెంచ్కే పరిమితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Playing XI: టెస్ట్ సిరీస్లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది. 2026 T20 వరల్డ్కప్ కోసం సన్నద్ధతలో భాగంగా, దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల T20 సిరీస్ను ఆడబోతుంది. మెగా టోర్నీ ముందు ఉండే చివరి సిరీస్ ఇదే. అయితే, తొలి మ్యాచ్ రేపు (డిసెంబర్ 9) కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
ఇక, కోల్కతా టెస్ట్లో మెడ గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్ లకు దూరమైన శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తరువాత తిలక్ వర్మ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక, వికెట్ కీపర్గా జితేష్ శర్మకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఆసియా కప్లో గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా సైతం ఈ సిరీస్తో తిరిగి జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. టీమిండియా ముగ్గురు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Tension at Gangavaram Port: గంగవరం పోర్టు దగ్గర టెన్షన్.. టెన్షన్..
అయితే, హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ అవలంభిస్తున్న ధోరణి ప్రకారం, ఆలౌరౌండర్ కోటాలో ఆల్రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్లను ఎంపియ చేయడంతో వాషింగ్టన్ సుందర్కు ఈ మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు.. అలాగే, ఓపెనర్ గా సంజూ శాంసన్ కూడా బెంచ్కే పరిమితం కావొచ్చే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పాటు స్పెషలిస్ట్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ XIలో స్థానం సంపాదించే ఛాన్స్ ఉండటంతో అర్శ్దీప్ సింగ్ సైతం ఈ మ్యాచ్కు దూరమైనట్లే కనిపిస్తుంది.
భారత జట్టు ప్లేయింగ్ XI:
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!