Team India Playing XI: జట్టులోకి గిల్ ఎంట్రీ- సంజూ ఔట్.. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే తుది జట్టు ఇదే
- రేపు కటక్లోని బారాబతి స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి టీ20..
- గిల్, హార్ధిక్ పాండ్యా రాకతో సంజూ, సుందర్, అర్శ్దీప్ సింగ్లు బెంచ్కే పరిమితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Playing XI: టెస్ట్ సిరీస్లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది. 2026 T20 వరల్డ్కప్ కోసం సన్నద్ధతలో భాగంగా, దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల T20 సిరీస్ను ఆడబోతుంది. మెగా టోర్నీ ముందు ఉండే చివరి సిరీస్ ఇదే. అయితే, తొలి మ్యాచ్ రేపు (డిసెంబర్ 9) కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనుంది.
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
- Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ఇక, కోల్కతా టెస్ట్లో మెడ గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్ లకు దూరమైన శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తరువాత తిలక్ వర్మ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక, వికెట్ కీపర్గా జితేష్ శర్మకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఆసియా కప్లో గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా సైతం ఈ సిరీస్తో తిరిగి జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. టీమిండియా ముగ్గురు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Tension at Gangavaram Port: గంగవరం పోర్టు దగ్గర టెన్షన్.. టెన్షన్..
అయితే, హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ అవలంభిస్తున్న ధోరణి ప్రకారం, ఆలౌరౌండర్ కోటాలో ఆల్రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్లను ఎంపియ చేయడంతో వాషింగ్టన్ సుందర్కు ఈ మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు.. అలాగే, ఓపెనర్ గా సంజూ శాంసన్ కూడా బెంచ్కే పరిమితం కావొచ్చే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పాటు స్పెషలిస్ట్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ XIలో స్థానం సంపాదించే ఛాన్స్ ఉండటంతో అర్శ్దీప్ సింగ్ సైతం ఈ మ్యాచ్కు దూరమైనట్లే కనిపిస్తుంది.
భారత జట్టు ప్లేయింగ్ XI:
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
తాజావార్తలు
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!