Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్కు కౌంట్డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటం ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు, మధ్యలో అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉండేదని, ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందని అన్నారు పార్థసారథి… కూటమి ప్రభుత్వ హయాంలో ఈ మార్పు సాధించడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి కోణంలో కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే చూసిందని ఆరోపించారు. రెవెన్యూ, భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
జీవో 596ను తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారని, ఆ జీవో రాకముందే 20 నుంచి 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు పార్థసారథి.. మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2014–19 మధ్య విశాఖలో ఐటీ హిల్స్ అభివృద్ధి జరిగిందని, అప్పట్లో వచ్చిన కంపెనీలను కూడా గత ప్రభుత్వం బెదిరించి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉత్తరాంధ్రపై ఉన్న వెనుకబడిన జిల్లాల ముద్రను తొలగించేందుకు కృషి చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినప్పటికీ, కనీస మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు కూడా ఖర్చు చేయలేదని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
తాజావార్తలు
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
-
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
-
Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
-
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్లో గేమ్చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!