Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautham Gambhir : భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్పై ఆధిపత్యం చాటుతున్న సమయంలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చరిత్ర సృష్టించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్నా, ఆ విజయానికి ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాదని శ్రీశాంత్ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబ్ షో గెస్ట్ ఇన్ ది న్యూస్రూమ్లో పాల్గొన్న శ్రీశాంత్, భారత జట్టు ప్రపంచకప్ విజయంలో ఆటగాళ్ల పాత్రనే అత్యంత కీలకమని పేర్కొన్నారు. టైటిల్ గెలిచిన వెంటనే మొత్తం క్రెడిట్ గౌతమ్ గంభీర్కు వెళ్లిపోయిందని, కానీ మైదానంలో మ్యాచ్ను మలుపుతిప్పిన వారు ఆటగాళ్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Clicky Ponting: 'ఫేక్ ఎడ్జ్' చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్బై!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
- Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లను జుజుబి అన్న ఫించ్!
సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో నిలబడకపోయి ఉంటే, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం సమర్థంగా లేకపోయి ఉంటే, బౌలింగ్ మార్పులు సరైన సమయంలో జరగకపోయి ఉంటే భారత్ విజయం సాధించేదా అని శ్రీశాంత్ ప్రశ్నించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్ణయాలు తీసుకుంటున్నది కోచ్ కాదని, మైదానంలో ఉన్న కెప్టెన్, ఆటగాళ్లేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఆశిష్ నెహ్రా వంటి కోచ్లు జట్టుతో మరింత ప్రత్యక్షంగా మమేకమై ఉంటారని కూడా వ్యాఖ్యానించారు.
గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు తాజాగా టీ20 ప్రపంచకప్ను కూడా సొంతం చేసుకుంది. అయినప్పటికీ జట్టు టెస్టు ఫార్మాట్లో ఎదుర్కొన్న పరాజయాలను గుర్తు చేస్తూ శ్రీశాంత్ మరింత ఘాటైన విమర్శలు చేశారు.
దశాబ్దానికి పైగా స్వదేశంలో దాదాపు అజేయంగా కొనసాగిన భారత టెస్టు జట్టు గత రెండు సంవత్సరాల్లో అనూహ్య పరాజయాలను చవిచూసింది. 2024 చివర్లో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్వాష్ కావడం, ఆ తర్వాత 2025లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం అభిమానులను నిరాశకు గురిచేశాయి. అంతేకాదు 2025 ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా భారత్ అర్హత సాధించలేకపోయింది. టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో భారత్కు కోచ్ కంటే మెంటర్ అవసరమని శ్రీశాంత్ అభిప్రాయపడ్డారు. మహేంద్రసింగ్ ధోనీ తరహాలో ఆటగాళ్లతో సోదరభావంతో మెలిగే వ్యక్తి జట్టుకు అవసరమని ఆయన పేర్కొన్నారు. గెలిచినప్పుడు నవ్వుతూ, ఓడినప్పుడు కోపపడటం మాత్రమే నాయకత్వం కాదని, ఆటగాళ్లను అర్థం చేసుకునే మార్గదర్శకుడు జట్టును మరింత బలంగా మార్చగలడని చెప్పారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ సహచర ఆటగాళ్లుగా భారత జట్టులో భాగమయ్యారు. ఒకప్పుడు కలిసి ప్రపంచకప్లు గెలిచిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అభిప్రాయ భేదాలు బహిరంగ చర్చకు రావడం భారత క్రికెట్లో మరో ఆసక్తికర అంశంగా మారింది.
తాజావార్తలు
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!