Rohit Sharma: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్.. తొలి భారత క్రికెటర్గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Creates New Record In IPL: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 250 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా చరిత్రపుటలకెక్కాడు. శనివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మూడు సిక్సులు కొట్టిన రోహిత్.. ఈ సందర్భంగానే ఆ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే.. అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఏకంగా 357 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత ఏబీ డీ విలియర్స్ 251 సిక్స్లతో రెండో స్థానంలో ఉండగా.. 250 సిక్స్లతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 235 సిక్స్లతో నాలుగో స్థానంలోనూ, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 229 సిక్స్లతో ఐదో స్థానంలోనూ ఉన్నారు.
Bhatti Vikramarka: ప్రజల్లో కాంగ్రెస్ ఉండకూడదని.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి
Also Read
- Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
- Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
- Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్బాల్ క్లబ్ అమ్మకం..
- R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరివరకు గట్టిగానే పోరాడింది కానీ, ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ వేసి, తన పంజాబ్ జట్టుని గెలిపించుకున్నాడు. వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అవ్వడం, పంజాబ్ గెలుపొందడం జరిగింది. ముంబై బ్యాటర్లలో గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57), రోహిత్ శర్మ(44) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. విజయం మాత్రం పంజాబ్నే వరించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
-
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
-
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
-
RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!