Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్పై విజయం.. సెమీస్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Won Against Bangladesh And Enters In Semi Finals: టీ20 వరల్డ్కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి, బంగ్లా జట్టుని చిత్తుగా ఓడించి, సెమీస్లో బెర్త్ని ఖరారు చేసింది. తొలుత బంగ్లా జట్టుని 127 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్.. బ్యాటింగ్లో బాగా రాణించడంతో, లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగలిగింది. స్వల్ప లక్ష్యమే కావడంతో.. ఎక్కడా ఆవేశపడకుండా, పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ, తమ జట్టుని గెలిపించుకున్నారు. నిజానికి.. సెమీర్ బెర్త్ కోసం ఇరు జట్లకి ఈ మ్యాచ్ ప్రాధాన్యం కావడంతో, హోరాహోరీగా పోరు సాగుతుందని అనుకున్నారు. కానీ, పాక్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ వార్ని వన్ సైడ్ చేసేసి, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. బంగ్లా జట్టులో విధ్వంసకర ఆటగాడైన లిటన్ దాస్ (10) త్వరగా ఔట్ అవ్వడంతో.. ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీంతో.. ఓపెనర్ శాంతో, సౌమ్య సర్కార్ ఆచితూచి ఆడారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా, నెమ్మదిగా రాణించారు. వీళ్లిద్దరు రెండో వికెట్కి 52 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇది చూసి.. ఇక బంగ్లా జట్టు కుదురుకుందని, ఇకపై పరువుల వర్షం కురిపించడం ఖాయమని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఎవ్వరూ పెద్దగా ఖాతా తెరువలేకపోయారు. ఓపెనర్ శాంతో (54) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి, జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. మధ్యలో సౌమ్య సర్కార్ (20), ఆఫిఫ్ హుసేన్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. ఇక మిగతావాళ్లంతా చేతులు ఎత్తేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రీది 4 వికెట్లు, షాదాబ్ ఖాన్ 2, హారిస్ రౌఫ్, ఇఫ్తిఖర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. స్వల్ప లక్ష్యమే కావడంతో నిదానంగా ఇన్నింగ్స్ని నెట్టుకొచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన రిజ్వాన్(32), బాబర్(25) తొలి వికెట్కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత వెనువెంటనే రెండు వికెట్లు పడ్డా.. పాక్ జట్టు ఒత్తిడికి గురవ్వకుండా, సునాయాసంగా లక్ష్యం దిశగా సాగింది. హారిస్ (31) కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోయాడు. షాన్ మసూద్ టెంప్ట్ అవ్వకుండా, చివరివరకు క్రీజులో నిలబడి జట్టుని గెలిపించాడు. చేతిలో 5 వికెట్లు, 11 బంతులు మిగిలి ఉండగానే.. పాక్ లక్ష్యాన్ని చేధించి, విజయం సాధించింది. దీంతో ఈ జట్టు సెమీస్లో బెర్త్ ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా ఓడిపోవడం వల్ల.. పాక్కి లైఫ్ వచ్చిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఆ జట్టు నెదర్లాండ్స్పై గెలిచి ఉంటే, పాక్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు అయ్యేవి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!