Virat Kohli: “ఓడినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు”.. ఇస్లామాబాద్లో ఫ్యాన్స్ సంబరాలు..
- ఓడిపోయినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు..
- ఇస్లామాబాద్లో పాక్ ఫ్యాన్స్ సంబరాలు..
- దేశంతో సంబంధం లేకుండా కోహ్లీకి పాక్లో ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ని కొట్టలేకపోతోంది. పాక్తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం.
Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య వైరానికి కేంద్రంగా ‘‘బెళగావి’’.. అసలేంటి ఈ వివాదం..
Also Read
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
తాజాగా, దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్పై మరోసారి ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ‘‘కింగ్’’ ఇన్నింగ్స్ మరోసారి పాకిస్తాన్ని మట్టికరిపించింది. ఏ దశలో కూడా పాక్ భారత్కి పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్తో పాటు అందరూ అదరగొట్టారు. పాకిస్తాన్ విధించిన 242 పరుగుల టార్గెట్ని 42.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. అప్పటి వరకు పెద్దగా ఫామ్లోని విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ అనగానే సెంచరీతో చెలరేగిపోయాడు. తాను ఆడిన చివరి బంతిని ఫోర్గా మార్చి, అటు సెంచరీని, ఇటు భారత్కి విజయాన్ని సాధించిపెట్టాడు. కోహ్లీకి అండగా శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ నిలిచారు.
అయితే, భారత ప్లేయర్ అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ లవర్స్ విరాట్ కోహ్లీని తమ స్టార్లతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా భావిస్తారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ 51 సెంచరీ కొట్టగానే పాకిస్తాన్లోని ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ జట్టు అభిమాని, కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆనందంతో కేరింతలు వేసింది. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ క్రికెట్ లవర్స్, కోహ్లీ సెంచరీ చేయగానే సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తమ జట్టు ఓడిపోతుందన్న బాధ కన్నా, కోహ్లీ సెంచరీ సాధించడంపై పాక్లోని కొందరు ఆనందంగా ఉండటం గమనార్హం.
اسلام آباد میں موجود کرکٹ شائقین ویرات کوہلی کی سینچری پر خوشی مناتے ہوئے https://t.co/5KyXSQMhdh pic.twitter.com/51Uliy4GNm
— Muhammad Faizan Aslam Khan (@FaizanBinAslam1) February 23, 2025
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!