Virat Kohli: “ఓడినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు”.. ఇస్లామాబాద్లో ఫ్యాన్స్ సంబరాలు..
- ఓడిపోయినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు..
- ఇస్లామాబాద్లో పాక్ ఫ్యాన్స్ సంబరాలు..
- దేశంతో సంబంధం లేకుండా కోహ్లీకి పాక్లో ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ని కొట్టలేకపోతోంది. పాక్తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం.
Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య వైరానికి కేంద్రంగా ‘‘బెళగావి’’.. అసలేంటి ఈ వివాదం..
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
తాజాగా, దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్పై మరోసారి ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ‘‘కింగ్’’ ఇన్నింగ్స్ మరోసారి పాకిస్తాన్ని మట్టికరిపించింది. ఏ దశలో కూడా పాక్ భారత్కి పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్తో పాటు అందరూ అదరగొట్టారు. పాకిస్తాన్ విధించిన 242 పరుగుల టార్గెట్ని 42.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. అప్పటి వరకు పెద్దగా ఫామ్లోని విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ అనగానే సెంచరీతో చెలరేగిపోయాడు. తాను ఆడిన చివరి బంతిని ఫోర్గా మార్చి, అటు సెంచరీని, ఇటు భారత్కి విజయాన్ని సాధించిపెట్టాడు. కోహ్లీకి అండగా శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ నిలిచారు.
అయితే, భారత ప్లేయర్ అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ లవర్స్ విరాట్ కోహ్లీని తమ స్టార్లతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా భావిస్తారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ 51 సెంచరీ కొట్టగానే పాకిస్తాన్లోని ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ జట్టు అభిమాని, కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆనందంతో కేరింతలు వేసింది. ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ క్రికెట్ లవర్స్, కోహ్లీ సెంచరీ చేయగానే సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తమ జట్టు ఓడిపోతుందన్న బాధ కన్నా, కోహ్లీ సెంచరీ సాధించడంపై పాక్లోని కొందరు ఆనందంగా ఉండటం గమనార్హం.
اسلام آباد میں موجود کرکٹ شائقین ویرات کوہلی کی سینچری پر خوشی مناتے ہوئے https://t.co/5KyXSQMhdh pic.twitter.com/51Uliy4GNm
— Muhammad Faizan Aslam Khan (@FaizanBinAslam1) February 23, 2025
తాజావార్తలు
-
Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!