WTC Final: డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో వెనుకబడ్డ టీమిండియా..
- పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి దూసుకుపోయిన సౌతాఫ్రికా..
- ఆసీస్ను 4-1తో ఓడిస్తే మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్కి భారత్ చేరుకునే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనే టీమిండియా ఆశలు నెరవేరడం కష్టంగా మారిపోయింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన భారత్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓడిపోవడంతో ఫైనల్కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. అడిలైడ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి థర్డో ప్లేస్ కి పడిపోయింది.
Read Also: Mega Family : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే.!
Also Read
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ఇక, భారత జట్టు పాయింట్ల శాతం 61.11 నుంచి 57.29కి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71కి పెంచుకున్న ఆసీస్ సెకండ్ ప్లేస్ కి పోయింది. ఇక, తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో నెంబర్ ర్యాంకును దక్కించుకుంది. టాప్-2లో నిలిచే టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి.
Read Also: Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
కాగా, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినా కూడా టీమిండియా ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ ఆ దిశగా టీమ్ అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ కు దక్షిణాఫ్రికా దాదాపుగా అర్హత సాధించినట్లే.. ఈ డబ్ల్యూటీసీలో తమ తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటే గెలిచి రేసులో వెనుకబడ్డ సౌతాఫ్రికా ఆ తర్వాత అనూహ్యంగా ఐదో టెస్టు విజయంతో నెంబర్ స్థానానికి దూసుకుపోయింది. ఫైనల్ చేరేందుకు ఆ టీమ్ కు మరో గెలుపు అవసరం. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్తో రెండు టెస్టుల సిరీస్లో సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ నెగ్గినా చాలు.
Read Also: Rajnath Singh: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
అయితే, దక్షిణాఫ్రికా దూకుడుతో భారత జట్టుకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో తర్వాత జరిగే మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. భారత్ 4-1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్లతో.. 3-1తో విజయం సాధిస్తే 60.52 పాయింట్లతో ఆసీస్ను దాటి టైటిల్ పోరుకు ఇండియా అర్హత సాధిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!