WTC Final: డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో వెనుకబడ్డ టీమిండియా..
- పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి దూసుకుపోయిన సౌతాఫ్రికా..
- ఆసీస్ను 4-1తో ఓడిస్తే మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్కి భారత్ చేరుకునే ఛాన్స్..
WTC Final: వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనే టీమిండియా ఆశలు నెరవేరడం కష్టంగా మారిపోయింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన భారత్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓడిపోవడంతో ఫైనల్కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. అడిలైడ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి థర్డో ప్లేస్ కి పడిపోయింది.
Read Also: Mega Family : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే.!
Also Read
- MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
- IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ఇక, భారత జట్టు పాయింట్ల శాతం 61.11 నుంచి 57.29కి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71కి పెంచుకున్న ఆసీస్ సెకండ్ ప్లేస్ కి పోయింది. ఇక, తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో నెంబర్ ర్యాంకును దక్కించుకుంది. టాప్-2లో నిలిచే టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి.
Read Also: Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
కాగా, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినా కూడా టీమిండియా ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ ఆ దిశగా టీమ్ అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ కు దక్షిణాఫ్రికా దాదాపుగా అర్హత సాధించినట్లే.. ఈ డబ్ల్యూటీసీలో తమ తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటే గెలిచి రేసులో వెనుకబడ్డ సౌతాఫ్రికా ఆ తర్వాత అనూహ్యంగా ఐదో టెస్టు విజయంతో నెంబర్ స్థానానికి దూసుకుపోయింది. ఫైనల్ చేరేందుకు ఆ టీమ్ కు మరో గెలుపు అవసరం. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్తో రెండు టెస్టుల సిరీస్లో సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ నెగ్గినా చాలు.
Read Also: Rajnath Singh: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
అయితే, దక్షిణాఫ్రికా దూకుడుతో భారత జట్టుకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో తర్వాత జరిగే మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. భారత్ 4-1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్లతో.. 3-1తో విజయం సాధిస్తే 60.52 పాయింట్లతో ఆసీస్ను దాటి టైటిల్ పోరుకు ఇండియా అర్హత సాధిస్తుంది.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!
-
TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
-
Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!