WTC Final: డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో వెనుకబడ్డ టీమిండియా..
- పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి దూసుకుపోయిన సౌతాఫ్రికా..
- ఆసీస్ను 4-1తో ఓడిస్తే మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్కి భారత్ చేరుకునే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనే టీమిండియా ఆశలు నెరవేరడం కష్టంగా మారిపోయింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన భారత్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓడిపోవడంతో ఫైనల్కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. అడిలైడ్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి థర్డో ప్లేస్ కి పడిపోయింది.
Read Also: Mega Family : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే.!
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
ఇక, భారత జట్టు పాయింట్ల శాతం 61.11 నుంచి 57.29కి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71కి పెంచుకున్న ఆసీస్ సెకండ్ ప్లేస్ కి పోయింది. ఇక, తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో నెంబర్ ర్యాంకును దక్కించుకుంది. టాప్-2లో నిలిచే టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి.
Read Also: Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
కాగా, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినా కూడా టీమిండియా ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ ఆ దిశగా టీమ్ అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ కు దక్షిణాఫ్రికా దాదాపుగా అర్హత సాధించినట్లే.. ఈ డబ్ల్యూటీసీలో తమ తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటే గెలిచి రేసులో వెనుకబడ్డ సౌతాఫ్రికా ఆ తర్వాత అనూహ్యంగా ఐదో టెస్టు విజయంతో నెంబర్ స్థానానికి దూసుకుపోయింది. ఫైనల్ చేరేందుకు ఆ టీమ్ కు మరో గెలుపు అవసరం. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్తో రెండు టెస్టుల సిరీస్లో సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ నెగ్గినా చాలు.
Read Also: Rajnath Singh: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
అయితే, దక్షిణాఫ్రికా దూకుడుతో భారత జట్టుకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో తర్వాత జరిగే మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. భారత్ 4-1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్లతో.. 3-1తో విజయం సాధిస్తే 60.52 పాయింట్లతో ఆసీస్ను దాటి టైటిల్ పోరుకు ఇండియా అర్హత సాధిస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!