IPL: ‘డబుల్ సెంచరీ’ చేసిన ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులో ఉన్న ఆ వైబ్రేషన్సే వేరు. కెప్టెన్గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఐపీఎల్లోనూ తన చెన్నై జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తన కెప్టెన్సీలో ఆ జట్టుని నాలుగుసార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఇప్పుడు తన పేరిట మరో రికార్డ్ని లిఖించుకున్నాడు. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్గా ఉన్న ధోనీ.. బుధవారం (మే 4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరుతో సీఎస్కే తరఫున 200వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు.
Read Also: High Court: హైకోర్టులో చింతమనేని ప్రభాకర్కు ఊరట
Also Read
- RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ 'నాలుగు' వికెట్ల పంజా.!
- CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
- Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
- LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
నిజానికి.. ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే! దీంతో, అతని స్థానంలో జడేజాను కెప్టెన్గా నిర్వహించారు. అయితే, ఈ కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా తాను ఆటపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతుండడం వల్ల.. జడేజా తిరిగి కెప్టెన్సీ బాధ్యతల్ని ధోనీకే అప్పగించాడు. ధోనీ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జట్టులో తిరిగి పూర్వవైభవం తిరిగొచ్చింది. ఇదిలావుండగా, బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ధోనీ మరో నాలుగు పరుగులు చేస్తే.. కోహ్లీ తర్వాత 6 వేల పరుగులు సాధించిన కెప్టెన్గా ధోనీ రికార్డులకెక్కుతాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్లో 199 మ్యాచులాడిన ధోనీ, 40.67 సగటుతో 4312 పరుగులు చేశాడు. అటు, కోహ్లీ 190 మ్యాచ్ల(185 ఇన్నింగ్స్)లో కలిపి ఐదు సెంచరీలు, 48 అర్ధ శతకాల సాయంతో 6451 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత స్థానంలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ(4721) పరుగులతో ఉన్నాడు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?