MS Dhoni: ధోనీ కోరుకుంటే.. ఇప్పటికీ టీమిండియాకు ఆడొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Could Have Still Played For India Says Wasim Akram: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు అవుతోంది. 2020 ఆగస్టు 15వ తేదీన ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. ఐపీఎల్లో మాత్రం ధోనీ ఇప్పటికీ ఉత్సాహంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో మోకాలి నొప్పితో బాధపడినా.. కెప్టెన్గా జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. బ్యాటర్గా సాధ్యమైనన్ని పరుగులు చేయడమే కాదు, కీపర్గా ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. ఎట్టకేలకు.. తాను చెప్పినట్టుగానే ఈ ఐపీఎల్ సీజన్లోనూ తన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు.
బికినీలో బీభత్సం సృష్టించిన సాక్షి సాగర్ చోప్రా సందడి
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కోరుకుంటే ఇప్పటికీ భారత జట్టు కోసం ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అతడు 2020 ఆగస్ట్లో సరైన నిర్ణయమే తీసుకున్నాడన్న తెలిపాడు. ఐపీఎల్లో ధోనీ ఆటతీరు చూస్తుంటే.. ఇండియాకు ఆడే సత్తా అతనిలో ఉందన్నాడు. కానీ.. అతడు సరైన టైంలో వీడ్కోలు పలికాడన్నాడు. అందుకే ధోనీ అంటే ధోనీనే అంటూ కితాబిచ్చాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మరింత బలంగా తిరిగొస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోనీ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడన్నాడు. అతనికి ఎంతో అనుభవం ఉందని, ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. మరీ ముఖ్యంగా.. ఇంకా ఆడాలన్న కోరిక ధోనీలో బలంగా ఉందన్నాడు. ఆ ఆకాంక్ష ఉండబట్టే, ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తున్నాడన్నాడు.
Bandi Sanajay: డీలర్ల సమ్మెతో ఇబ్బంది.. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు నిలిచిన రేషన్
ఒకవేళ.. ఆడాలన్న ఆకాంక్ష లేనప్పుడు, ఎంత ఫిట్గా ఉన్నా వ్యర్థమేనని, అప్పుడు పనితీరు చూపించలేరని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. ధోనీలో ఇంకా ఆట పట్ల ప్యాషన్ ఉందని చెప్పుకొచ్చాడు. ధోనీని క్రికెట్ జెమ్గా, కెప్టెన్ జెమ్గా అభివర్ణించాడు. ఓకే జట్టు తరఫున ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలవడమన్నది అంత ఆషామాషీ విషయం కాదన్నాడు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ అని, ఇందులో పది జట్లు ఉన్నాయని, ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడితేనే ప్లేఆఫ్కు వెళ్లగలవని అన్నాడు. అయితే.. ధోనీకి ఏ జట్టు ఇచ్చినా, దాన్ని ఫైనల్కు తీసుకెళ్లి విజయం సాధించగలడని, ఆ నైపుణ్యం ఒక్క ధోనీకి మాత్రమే ఉందని వసీమ్ పొగడ్తలు కురిపించాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..