Javed Miandad: “జీవితం, మరణం అల్లా చేతిలో ఉంటాయి”.. పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరించడంపై మియాందాద్
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. బీసీసీఐ తన వైఖరి ఇప్పటికే స్పష్టం చేయగా.. పాకిస్తాన్ జట్టు కూడా తాము ఇండియాలో నిర్వహించే వరల్డ్ కప్ మ్యాచుల నుంచి వైదొలుగుతామని బెదిరిస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము ఇండియాలో ఆడాలంటే మ్యాచులను కోల్కతా మరియు చెన్నైలలో నిర్వహించాలని పాక్ ఆడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also: Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ఇదిలా ఉంటే పాక్ మాజీ స్టార్ ఆటగాడు జావెద్ మియాందాద్ ఈ వివాదంపై స్పందించారు. భారత్ లో పాకిస్తాన్ జట్టు సందర్శించేందుకు ఏ సమస్య ఉండదని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ కు రావడం భారత్ వంతు అని అన్నారు. ‘‘ భద్రతను మరిచిపోండి.. మరణం మీ విధి అయితే అది ఖచ్చితంగా వస్తుంది. జీవితం, మరణం అల్లా చేతిలో ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు భారత్ పిలిస్తే మేం వెళ్తాం, మేమే చివరిసారిగా భారత్ కు వెళ్లాం, కానీ భారత్ ఇక్కడికి రాలేదు, ఇప్పుడు వారి వంతు వచ్చింది అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అన్నారు. 2012 నుంచి భారత్, పాక్ లు ద్వైపాక్షిక సిరీస్ లో తలపడలేదు.
గత వారం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బీసీసీఐ అహంకారంగా వ్యవహరిస్తోందని, సూపర్ పవర్ లా ప్రవర్తిస్తోందని నిందించాడు. క్రికెట్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న భారత్ ప్రవర్తించే తీరు దురహంకారంగా ఉందని, దీనికి కారణం వారికి నిధులు ఎక్కువగా ఉండటమే అని, వారు ఎవరితో ఆడాలి, ఎవరితో ఆడకూడదని అనే విషయాలను సూపర్ పవర్ గా నిర్దేశిస్తుందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!