Javed Miandad: “జీవితం, మరణం అల్లా చేతిలో ఉంటాయి”.. పాక్లో ఆడేందుకు భారత్ నిరాకరించడంపై మియాందాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. బీసీసీఐ తన వైఖరి ఇప్పటికే స్పష్టం చేయగా.. పాకిస్తాన్ జట్టు కూడా తాము ఇండియాలో నిర్వహించే వరల్డ్ కప్ మ్యాచుల నుంచి వైదొలుగుతామని బెదిరిస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము ఇండియాలో ఆడాలంటే మ్యాచులను కోల్కతా మరియు చెన్నైలలో నిర్వహించాలని పాక్ ఆడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also: Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?
Also Read
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
- ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?
ఇదిలా ఉంటే పాక్ మాజీ స్టార్ ఆటగాడు జావెద్ మియాందాద్ ఈ వివాదంపై స్పందించారు. భారత్ లో పాకిస్తాన్ జట్టు సందర్శించేందుకు ఏ సమస్య ఉండదని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ కు రావడం భారత్ వంతు అని అన్నారు. ‘‘ భద్రతను మరిచిపోండి.. మరణం మీ విధి అయితే అది ఖచ్చితంగా వస్తుంది. జీవితం, మరణం అల్లా చేతిలో ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు భారత్ పిలిస్తే మేం వెళ్తాం, మేమే చివరిసారిగా భారత్ కు వెళ్లాం, కానీ భారత్ ఇక్కడికి రాలేదు, ఇప్పుడు వారి వంతు వచ్చింది అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అన్నారు. 2012 నుంచి భారత్, పాక్ లు ద్వైపాక్షిక సిరీస్ లో తలపడలేదు.
గత వారం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బీసీసీఐ అహంకారంగా వ్యవహరిస్తోందని, సూపర్ పవర్ లా ప్రవర్తిస్తోందని నిందించాడు. క్రికెట్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న భారత్ ప్రవర్తించే తీరు దురహంకారంగా ఉందని, దీనికి కారణం వారికి నిధులు ఎక్కువగా ఉండటమే అని, వారు ఎవరితో ఆడాలి, ఎవరితో ఆడకూడదని అనే విషయాలను సూపర్ పవర్ గా నిర్దేశిస్తుందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?