Ishan Kishan: పాకిస్థాన్పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్లో రెచ్చిపోతాం!
- పాకిస్థాన్పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే
- బంతిని గమనిస్తూ సింపుల్గా ఆడా
- ఇక టీ20 ప్రపంచకప్లో రెచ్చిపోతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan on India vs Pakistan Win: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేమే అని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచ్లో విజయం సాధించడం భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉందని, తన బలాలపై నమ్మకం ఉంచి ఆడానని తెలిపాడు. బంతిని గమనిస్తూ సింపుల్గా ఆడటం, ఫీల్డ్ను ఉపయోగించుకోవడం తన ప్రణాళిక అని కిషన్ వివరించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కిషన్ హాఫ్ సెంచరీ (77; 40 బంతుల్లో 10×4, 3×6) బాదాడు.
ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘ఆఫ్సైడ్ ఆటను మెరుగుపరచేందుకు చాలా కష్టపడ్డా. ఆఫ్సైడ్లో బాగా ఆడితే బౌలర్లు నేను కోరుకున్న లైన్లో బౌలింగ్ చేస్తారు. అందుకే గ్యాప్లను లక్ష్యంగా చేసుకుని షాట్లు ఆడా. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనీసం రెండు పరుగులు తీసేలా ప్లాన్ చేశా. మ్యాచ్కు ముందు 160–170 మధ్య స్కోరు చేస్తే మంచి టోటల్ అవుతుందని నాకు అనిపించింది. అదే లక్ష్యంతో ఇన్నింగ్స్ను నిర్మించా. పాకిస్థాన్పై గెలవడం టోర్నీ మిగతా మ్యాచ్లలో జట్టుకు మంచి మోమెంటమ్ ఇస్తుంది’ అని చెప్పాడు.
Also Read
- Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
- ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం... 2027 వరల్డ్ కప్లో అసలు ఏం జరగబోతోంది..?
- Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- Coaching Staff: భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్లో మార్పులు.. ఆ ఇద్దరికి బీసీసీఐ స్వస్తి..
Also Read: Bill Gates-AP: గన్నవరం చేరుకున్న బిల్గేట్స్.. ఏపీ నేతలతో కీలక భేటీ!
‘కొత్త బంతితో జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ ప్రమాదకారే. బుమ్రా అద్భుతం. అతడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హార్దిక్ పాండ్య ప్లాన్ ప్రకారం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. మా పేసర్లు ఆరంభంలోనే అద్భుతంగా రెండు ఓవర్లు వేశారు. అప్పుడే మ్యాచ్పై పట్టు సాధించాం. జట్టు సమిష్టి ప్రదర్శన కారణంగానే విజయం సాధించాం. పాకిస్థాన్పై విజయం జట్టుకు ఎంతో ముఖ్యం. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ టోర్నీలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాము’ అని ఇషాన్ కిషన్ స్పష్టం చెప్పకొచ్చాడు.
తాజావార్తలు
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్కు రూ.75 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!