Ramayana: ట్రైలర్కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్కు రూ.75 కోట్ల డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక హైప్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కుల కోసం టీ సిరీస్ ఏకంగా రూ.75 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకుందనే సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం, టీ సిరీస్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో ‘రామాయణం’ రెండు భాగాలకు సంబంధించిన మ్యూజిక్ హక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. దీంతో ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మ్యూజిక్ డీల్ గా ఈ మూవీ నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ డీల్ నిజమైతే పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ‘పుష్ప 2’ మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో, ‘రామాయణం’ ఆ రికార్డును కూడా అధిగమించినట్టే అవుతుంది. సినిమా విడుదలకు ముందే ఇలాంటి భారీ వ్యాపారం జరగడం ఈ ప్రాజెక్ట్పై ఉన్న మార్కెట్ నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీతమే హైలెట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఈ ప్రాజెక్ట్కు సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆర్కెస్ట్రేషన్తో పాటు భారతీయ ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే సంగీతాన్ని అందించనున్నారని ఇప్పటికే చిత్రబృందం కూడా వెల్లడించింది. ఈ కారణంగానే మ్యూజిక్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
మరోవైపు, సినిమా ప్రచారంలో కూడా మేకర్స్ వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు సాయంత్రం లేదా రాత్రి విడుదల చేస్తుంటారు. కానీ ‘రామాయణం’ ట్రైలర్ను జూలై 30న తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమైన ఉదయం 4:15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవిత్రమైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమాకు ఉన్న ఆధ్యాత్మిక భావనను ప్రేక్షకులకు మరింత బలంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్తో పాటు సన్నీ డియోల్, రవి దూబే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!