Chennai Super Kings: సీఎస్కేను వీడిన జడ్డూ భాయ్.. చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కీలక వ్యాఖ్యలు..
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడిన రవీంద్ర జడేజా..
- జడ్డూ భాయ్ ని వదిలి పెట్టుకోవడం కఠిన నిర్ణయమే..
- మాకు సంజూ శాంసన్ ను తీసుకోవడానికి ఇదే మంచి అవకాశం: కాశీ విశ్వనాథన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంఛైజీలు ప్లేయర్స్ ట్రేడ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్ టీంను వీడారు. వీరు ఇరువురు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేరారు. అలాగే, ఆర్ఆర్ కు చెందిన సంజూ శాంసన్ను సీఎస్కే దక్కించుకుంది. ఈ విషయం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది. అయితే, ఈ రోజు (నవంబర్ 15న) అధికారికంగా ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అయితే, జడ్డూ భాయ్ చెన్నై జట్టును వీడటంపై ఆ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీవిశ్వనాథన్ మాట్లాడుతూ.. జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని యాజమాన్యం కోరుకుంది. కానీ, ఆక్షన్లో ఎక్కువమంది మన బ్యాటర్లు లేరు.. దీంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలని అనుకున్నాం.. కొన్ని ఏళ్లుగా తమ జట్టు విజయాల్లో కీ రోల్ పోషిస్తూ వచ్చిన రవీంద్రను వదులుకోవడం నిజంగా కఠినమైన నిర్ణయం అని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
Read Also: IBomma Ravi Arrested : కీలక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. కోర్టుకు తరలింపు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, తప్పనిసరి పరిస్థితుల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ జడ్డూ భాయ్ ని వదిలి పెట్టుందుకు నిర్ణయం తీసుకుంది అని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక, దీనికి ముందు తన ఆలోచనను ప్లేయరక్స్ తో పంచుకుంది.. పర్మిషన్ తోనే యాజమాన్యం ఈ ట్రేడ్కు వెళ్లింది అన్నారు. అలాగే, జడేజా కూడా సానుకూలంగానే రియాక్ట్ అయ్యారు.. సామ్ కరన్ను వదిలి పెట్టుకోవడం కూడా కఠిన నిర్ణయమే.. వీరు తమ కెరీర్ ది బెస్ట్ ఇచ్చారని తెలిపారు. చెన్నై జట్టును బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. మాకు ఇండియన్ బ్యాటర్ను పొందడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకలేదు. సంజూ.. ఐపీఎల్లో చాలా అనుభవమున్న ప్లేయర్..అతడు దాదాపు 4,500కు పైగా రన్స్ చేశాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్కు సారథిగా కొనసాగుతున్నాడని కాశీ విశ్వనాథన్ వివరించారు.
Read Also: Betting Apps Case : సీఐడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రాణా..
ఇక, అభిమానుల బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ తప్పలేదని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. ఈ నిర్ణయంతో సీఎస్కే అభిమానులు నిరాశకు గురయ్యారు. వారి నుంచి మాకు చాలా మెసేజ్లు కూడా వచ్చాయి.. కానీ మార్పు తప్పనిసరి అయింది. రాబోయే కాలంలో చెన్నై ఇప్పటిలాగే మెరుగైన ప్రదర్శన, నిలకడగా రాణిస్తుందని పేర్కొన్నాడు. అయితే, జడ్డూ భాయ్ 12 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2022 సీజన్లో పలు మ్యాచ్ లకు కెప్టెన్గా వ్యవహరించాడు. జడేజా ఇప్పటి వరకు 186 మ్యాచుల్లో (సీఎస్కే తరఫున) 143 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 2,198 రన్స్ చేశాడు. ఈ ఆల్రౌండర్ ఐపీఎల్ లీగ్ ఫీజ్ను రూ.18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించి ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్. చెన్నై సూపర్ కింగ్స్ సంజూ శాంసన్ లీగ్ ఫీజులో ఎలాంటి మార్పు చేయకుండా రూ.18 కోట్లకు దక్కించుకుంది.
“Decision taken on mutual agreement with Jadeja and Curran.” – CSK MD Kasi Viswanathan speaks on the trade. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/8HAZrdIBJP
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!