IPL 2023 : ఐపీఎల్ లో కమ్ బ్యాక్ చేస్తున్న సీనియర్ ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. అజింకా రహానే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సమవుజ్జీగా టీమిండియాలో వెలుగొందారు.. అజింకా రహానే 2022 నుంచి టీమిండియాలో చోటు కోల్పోయాడు. 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రహానేని పక్కనబెట్టగా 2022 సీజన్ మధ్యలో రహానే గాయపడి.. టీమ్ కి దూరమయ్యాడు. బేస్ ప్రైజ్ కి సీఎస్కే లోకి వచ్చిన రహానే, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగాడు. 225.93 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు చేసిన రహానే.. 2023 సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు.
Also Read : IPL 2023 : దుమ్మురేపిన రింకూ సింగ్.. రెచ్చిపోయిన ఇంపాక్ట్ ప్లేయర్
Also Read
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
- Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
- Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు దూరమైన విజయ్ శంకర్ 2019 నుంచి 2021 వరకూ సన్ రైజర్స్ హైదరాబద్ టీమ్ లో ఉన్నాడు. ఒకటి రెండు మ్యాచ్ లు తప్ప మిగిలిన మ్యాచ్ ల్లో రెగ్యూలర్ గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. గత సీజన్ లో కూడా ఫెయిల్ అయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విజయ్ శంకర్.. కేకేఆర్ తో మ్యాచ్ లో 24 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 63 పరుగుల సునామీ ఇన్సింగ్స్ ఆడాడు. ఇక వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ లో వెలుగులోకి వచ్చిన ఆల్ రౌండర్. కేకేఆర్ ని ఒంటి చేత్తో ప్లే ఆఫ్స్ కి చేర్చాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అక్కడ పెద్దగా ఆకట్టుకోలేక టీమ్ కు దూరమయ్యాడు. శుబ్ మన్ గిల్ ని వదిలేసి వెంకటేశ్ అయ్యర్ ని కేకేఆర్ రిటైన్ చేసుకుంది. అయితే గత సీజన్ లో అట్టర్ ప్లాప్ అయిన వెంకటేశ్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 40 బంతుల్లో 83 పరుగులు చేశాడు.
Also Read : Virupaksha: డేట్ లాక్ అయ్యింది… ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరు?
పేలవ ఫామ్ తో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు దూరమైన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. బ్రిస్బేన్ టెస్టులో సంచలన పర్ఫామెన్స్ ఇచ్చి.. టీమిండియాకి కీ ప్లేయర్ గా మారాడు. 2022.23 ఏడాదిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్సులతో 68 పరుగులు చేశాడు. శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్ల కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన బ్యాటర్ శిఖర్ ధావన్. అయితే ఐపీఎల్ 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటరి పోరాటంతో 66 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ చేశాడు. 2018లో ముంబై ఇండియన్స్ తరపున ఆరంగేట్రం చేసిన మయాంక్ మర్కండే.. ఐపీఎల్ లో తీసిన మొదటి వికెట్ ఎంఎస్ ధోనిది.. ఆ సీజన్ లో 15 వికెట్లు తీసిన మయాంక్ మర్కండే 2019 సీజన్ లో గాయంతో 3 మ్యాచ్ లే ఆడాడు. ఆ తర్వాత 2020లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ 2021 సీజన్ లో ఒక్క మ్యాచ్.. 2022లో రెండు మ్యాచ్ లు ఆడాడు. ఆ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.

తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!