ఐపీఎల్ సీజన్ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్ స్టేడియ వేదికగా గుజరాత్ టైటాన్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్కు ఆదిలోని షాక్ తగిలింది.
సౌథీ బౌలింగ్లో సామ్ బిల్లింగ్స్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (5 బంతుల్లో 7; ఫోర్) ఔటయ్యాడు. రెండో ఓవర్లోనే గిల్ వికెట్ పడటంతో గుజరాత్ టైటాన్స్ ఆచితూచి ఆడుతుంది. వన్డౌన్లో వచ్చిన హార్ధిక్ పాండ్యా 17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేయగా, సాహా 14 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 16 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.
తుది జట్లు:
కోల్కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్ (వికెట్కీపర్), ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్