India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్పై సమానంగా గడ్డి ఉండటంతో కొత్త బంతితో బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయామని, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ఇక భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పారు. తొలి వన్డేలో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారని, అదే జోరును కార్డిఫ్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డిఫ్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉందని, ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో మూడు విజయాలు సాధించిన విషయం తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందన్నారు.
మరోవైపు.. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్కు ఇది కీలక అవకాశం కానుంది. చాలా కాలం తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా అతడే నిర్వహించనున్నాడు. టాస్ సమయంలో, రాహుల్ను జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టం చేశారు. అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిపారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!