India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్పై సమానంగా గడ్డి ఉండటంతో కొత్త బంతితో బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయామని, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
ఇక భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పారు. తొలి వన్డేలో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారని, అదే జోరును కార్డిఫ్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డిఫ్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉందని, ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో మూడు విజయాలు సాధించిన విషయం తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందన్నారు.
మరోవైపు.. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్కు ఇది కీలక అవకాశం కానుంది. చాలా కాలం తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా అతడే నిర్వహించనున్నాడు. టాస్ సమయంలో, రాహుల్ను జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టం చేశారు. అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిపారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!