India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్పై సమానంగా గడ్డి ఉండటంతో కొత్త బంతితో బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయామని, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
ఇక భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పారు. తొలి వన్డేలో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారని, అదే జోరును కార్డిఫ్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డిఫ్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉందని, ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో మూడు విజయాలు సాధించిన విషయం తమకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందన్నారు.
మరోవైపు.. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్కు ఇది కీలక అవకాశం కానుంది. చాలా కాలం తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా అతడే నిర్వహించనున్నాడు. టాస్ సమయంలో, రాహుల్ను జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టం చేశారు. అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిపారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
తాజావార్తలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!