India vs New Zealand: కివీస్ చిత్తు.. భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won Second T20I Match Against New Zealand: ఈరోజు బే ఓవల్ స్టేడియంలో న్యూజీల్యాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ భారత్ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించింది. సూర్యకుమార్ యాదవ్ శతకంతో చెలరేగడంతో, కివీస్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ వేస్తూ వికెట్లు పడగొట్టడంతో.. న్యూజీలాండ్ జట్టు చతికిలపడింది. భారత్ కుదిర్చిన లక్ష్యాన్ని చేధించలేక కుప్పకూలింది. దీంతో.. భారత్ ఏకంగా 65 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్లో టీ20 సిరీస్లో భారత్ పైచేయి సాధించింది.
తొలుత టాస్ గెలిచిన న్యూజీలాండ్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. అయితే.. ఓపెనర్లు భారత్కి ఆశించిన స్థాయిలో శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తనని ఓపెనర్గా పంపడంతో.. రిషభ్ చెలరేగుతాడని అనుకుంటే, 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (36) పర్వాలేదనిపించి, ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 111) మాత్రం తాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాటర్లు అతనికి మద్దతు ఇవ్వడంతో.. సూర్య తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో పరుగులు వర్షం కురిపించాడు. కివీస్ బౌలర్లు అతడ్ని ఔట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎలాంటి బంతులు వేసినా సరే, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బాదేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా, సూర్య మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా విశ్వరూపం చూపించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
Also Read
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాన్వే, కేన్ కలిసి బాగానే రాణించారు. కానీ ఎప్పుడైతే కాన్వే వికెట్ పడిందో, అప్పటినుంచి కివీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేన్ విలియమ్సన్ (51 బంతుల్లో 61) ఒక్కడే చివరివరకు ఒంటరి పోరాటం కొనసాగించాడు. మిగిలిన వాళ్లెవరకు భారత బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దీంతో 126 పరుగులకే కివీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా.. చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు.. భువనేశ్వర్, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!