World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..
- నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ చారిత్రాత్మక విజయం
- 255 పరుగుల భారీ స్కోర్తో కివీస్పై ఒత్తిడి
- 96 పరుగుల తేడాతో కివీస్పై భారత్ ఘనవిజయం
- 19 ఓవర్లకు కివీస్ ఆలౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 Wolrd Cup Final : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమైంది. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన టీమ్ ఇండియా, మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. గత 2024 టీ20 ప్రపంచకప్ గెలుపు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. వేలమంది అభిమానుల ‘వందేమాతరం’ నినాదాల మధ్య భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా, అలాగే మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
Also Read
- Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
- Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
- Sanju Samson-Gambhir: సంజు అసంతృప్తి.. గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం.. సోషల్ మీడియాలో రచ్చ!
- నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడి సిక్సర్ల వర్షం కురిపించారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు ఆది నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా లోకల్ హీరో అక్షర్ పటేల్ పవర్ప్లేలోనే ఫిన్ అలెన్ వంటి ప్రమాదకర బ్యాటర్ను అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ మాయాజాలంతో కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా, ఒక దశలో హ్యాట్రిక్ తీసేంత పని చేశాడు. మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్ వంటి సీనియర్లను తన అద్భుతమైన స్లోయర్ డెలివరీలతో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫెర్ట్ ఒక్కడే 52 పరుగులతో పోరాడినప్పటికీ, వరుణ్ చక్రవర్తి అతడిని అవుట్ చేయడంతో కివీస్ పతనం పూర్తయింది. చివరలో అభిషేక్ శర్మ బౌలింగ్లో జాకబ్ డఫ్ఫీ వికెట్ తీయడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఫీల్డింగ్లో కూడా భారత్ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు పట్టిన క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి. ఈ విజయంతో భారత్ కేవలం టైటిల్ను గెలవడమే కాకుండా, టీ20 ఫార్మాట్లో తామే అసలైన ‘బాస్’ అని నిరూపించుకుంది. మ్యాచ్ ముగియగానే స్టేడియం మొత్తం బాణాసంచా వెలుగులతో, అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది.
Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
తాజావార్తలు
-
Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!