Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
- యుద్ధ ప్రభావంతో పడిపోయిన రొయ్యల ధరలు
- ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు భారీ నష్టం
- పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన మార్కెట్ ధరలు
- ప్రభుత్వ జోక్యం కోరుతున్న ఆక్వా సాగుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని, ముఖ్యంగా రొయ్యల సాగుదారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు, ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్పై ప్రధాని ఫైర్..
Also Read
గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి ₹30 నుండి ₹40 వరకు పతనమవ్వడంతో, ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు ₹40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర ₹510 నుండి ₹470కి, 40 కౌంట్ ధర ₹410 నుండి ₹360కి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బ తీసింది.
మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత (Feed) ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Prize Money: ఫైనల్లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు , ఏజెంట్లు ‘సిండికేట్’గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సీడ్ (Seed) లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవ్వడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది.
నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Bollywood : సమంత భర్తతో సల్మాన్ ఖాన్..? సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
-
Bollywood : కృతి సనన్, రష్మిక దేవరకొండను లాక్ చేసిన బిగ్ బ్యానర్.. ఏంటి సంగతి?
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
ట్రెండింగ్
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!