Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Aqua Sector War Impact Shrimp Farmers Andhra Pradesh

Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం

Published Date :March 8, 2026 , 5:57 pm
By Gogikar Sai Krishna
  • యుద్ధ ప్రభావంతో పడిపోయిన రొయ్యల ధరలు
  • ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు భారీ నష్టం
  • పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన మార్కెట్ ధరలు
  • ప్రభుత్వ జోక్యం కోరుతున్న ఆక్వా సాగుదారులు
Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగాన్ని, ముఖ్యంగా రొయ్యల సాగుదారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు, ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..

Also Read

  • CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
  • CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Add as a preferred
source on google

గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి ₹30 నుండి ₹40 వరకు పతనమవ్వడంతో, ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు ₹40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర ₹510 నుండి ₹470కి, 40 కౌంట్ ధర ₹410 నుండి ₹360కి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బ తీసింది.
మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత (Feed) ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Prize Money: ఫైనల్‌లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?

దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు , ఏజెంట్లు ‘సిండికేట్’గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సీడ్ (Seed) లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవ్వడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది.

నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Aquaculture
  • Aqua Sector
  • Aquaculture Crisis
  • Export Crisis
  • Seafood Exports

తాజావార్తలు

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

  • IPL 2026-BCCI: ఐపీఎల్‌లో సంచలనం.. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు.. సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్!

  • Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్‌లు ఇవే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions