Rohit Sharma: ఆ వేడుకల కోసం పాకిస్థాన్కు రోహిత్ శర్మ..?
- ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ..
- ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ టీమిండియా కెప్టెన్ హాజరవుతారా? లేదా?..
- ప్రారంభ వేడుకల్లో భారత సారథి పాల్గొంటారని బీసీసీఐ ప్రతినిధి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కానుంది. ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో.. ఒక వేళ భారత్ సెమీస్, ఫైనల్కు చేరినా అవన్నీ దుబాయ్లోనే కొనసాగనున్నాయి. అయితే, 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్లో ఆడేందుకే జట్టును పంపించబోమని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇప్పుడు కెప్టెన్ హోదాలో ఆ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ ప్రతినిధులు మాత్రం భారత కెప్టెన్ పాకిస్థాన్ వెళ్తాడని చెప్తున్నారు.
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
- Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
- Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ఇక, టీమిండియా సారథి పాకిస్థాన్కు వెళ్తాడు.. పీసీబీ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాడు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ ఆధ్వర్యంలో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ జరగబోతుందన్నారు. పాక్ కు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే.. భారత్ కెప్టెన్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు కొనసాగుతాయా? లేదా? అనేది వేచి చూడాలి. పాక్ మాత్రం తమ దేశంలోనే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పట్టుబట్టింది. పాక్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభంకానుంది. పాకిస్థాన్తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇప్పటి వరకు భారత్, పాక్ మాత్రం తమ స్క్వాడ్లను వెల్లడించలేదు. జనవరి 19 నాటికి టీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!