No Parking Space- No Car: పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు.. మహారాష్ట్ర సర్కార్ కొత్త రూల్..
- మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన..
- పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దని తెలిపిన మంత్రి ప్రతాప్ సర్నాయక్..
- పార్కింగ్కు సంబంధించిన పత్రాలు సమర్పించిన తర్వాత కారు కొనుగోలు చేయాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Parking Space- No Car: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే రూల్ అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Read Also: Khammam: యువకుడి అనుమానాస్పద మృతి.. చివరి వాయిస్ మెసేజ్ విని షాక్
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ఇక, మహారాష్ట్రలో గల పలు నగరాల్లోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ కార్లను రోడ్ల మీదనే పార్క్ చేస్తున్నారు. దీంతో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది అని మంత్రి ప్రతాప్ సర్నాయక్. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు.. అంబులెన్స్లు, అగ్నిమాపక వెహికిల్స్ అందించే అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో.. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్కు సంబంధించిన పత్రాలను సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉందని మంత్రి అన్నారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పడం లేదు.. దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సర్నాయక్ వెల్లడించారు.
Read Also: Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ
అయితే, నగరాల్లో ట్రాఫిక్ను అదుపు చేసేందుకు, ప్రజలు ప్రైవేటు వెహికిల్స్ పై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకుబోతున్నామని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రో పాలిటన్ రీజియన్లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!