No Parking Space- No Car: పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు.. మహారాష్ట్ర సర్కార్ కొత్త రూల్..
- మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన..
- పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దని తెలిపిన మంత్రి ప్రతాప్ సర్నాయక్..
- పార్కింగ్కు సంబంధించిన పత్రాలు సమర్పించిన తర్వాత కారు కొనుగోలు చేయాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Parking Space- No Car: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే రూల్ అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
Read Also: Khammam: యువకుడి అనుమానాస్పద మృతి.. చివరి వాయిస్ మెసేజ్ విని షాక్
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇక, మహారాష్ట్రలో గల పలు నగరాల్లోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ కార్లను రోడ్ల మీదనే పార్క్ చేస్తున్నారు. దీంతో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది అని మంత్రి ప్రతాప్ సర్నాయక్. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు.. అంబులెన్స్లు, అగ్నిమాపక వెహికిల్స్ అందించే అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటంతో.. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్కు సంబంధించిన పత్రాలను సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉందని మంత్రి అన్నారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పడం లేదు.. దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సర్నాయక్ వెల్లడించారు.
Read Also: Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ
అయితే, నగరాల్లో ట్రాఫిక్ను అదుపు చేసేందుకు, ప్రజలు ప్రైవేటు వెహికిల్స్ పై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకుబోతున్నామని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రో పాలిటన్ రీజియన్లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!