IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా T20 మ్యాచ్ రద్దు? ఒడిశా హైకోర్టులో పిల్ దాఖలు..
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.
ఇక అంతర్జాతీయ సిరీస్ లపై BCCI ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికా తో ఐదు మ్యాచ్ ల T20 సిరీస్ టీమిండియా ఆడనుంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9న తొలి T20 జరగనుండగా.. అనంతరం రెండో T20 ఒడిశాలోని కటక్ వేదికగా జరుగుతుంది. ఇందుకోసం అక్కడి బారాబతి స్టేడియాన్ని సిద్ధం కూడా చేస్తున్నారు.
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
అయితే రెండో టి20 మ్యాచ్ ను జరపకూడదంటూ సంజయ్ నాయక్ అనే వ్యక్తి ఒడిషా హైకోర్టులో PIL ను దాఖలు చేశాడు. బారాబతి స్టేడియం 44 వేల సీటింగ్ కెపాసిటీతో ఉన్నట్లు పేర్కొన్న అతడు.. అందులో ఫైర్ సేఫ్టీ విషయంలో లోపాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అయితే ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల భద్రతలకు ముప్పు పొంచి ఉందని తన వ్యాజ్యంలో సంజయ్ పేర్కొన్నాడు.
జూన్ 12వ తేదీన కటక్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కోర్టు ఏ విధమైన తీర్పును ఇస్తుందో అని క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా..భారత ఆటగాళ్లు రేపు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇక తొలి T20 ఈ నెల 9న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరగనుంది.
తాజావార్తలు
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!