Champions Trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం..
- నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం..
- తొలి మ్యాచ్లో తలపడనున్న పాకిస్థాన్, న్యూజిలాండ్..
- మధ్యాహ్నం 2.30కు ప్రారంభంకానున్న మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. అయితే, 2017లో రద్దై.. మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ టోర్నీలో తలపడుతున్నప్పటికి వెస్టిండీస్, శ్రీలంక జట్లు టోర్నీకి కనీసం అర్హత కూడా సాధించలేకపోయాయి.
Read Also: Minister Nara Lokesh: టీచర్స్ సీనియారిటీ జాబితా సిద్ధం చేయండి.. లోకేష్ ఆదేశాలు
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
అయితే, 1996లో వన్డే ప్రపంచకప్కు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్.. మళ్లీ ఇప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీకి సారథ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్.. ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తుంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఆ టీమ్.. టోర్నమెంట్లో శుభారంభం చేయాలని భావిస్తుంది. కానీ, తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ముక్కోణపు సిరీస్లో కివీస్.. పాక్ను లీగ్తో పాటు ఫైనల్లోనూ మట్టికరిపించింది.
Read Also: HariHara VeeraMallu : పవన్ ఫ్యాన్స్ కు ఏఎం రత్నం గుడ్న్యూస్!
కాగా, ఈ టోర్నమెంట్లో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్లు, రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ జరగనుంది. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదికగా జరగనున్నాయి. టీమిండియా తమ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడబోతుంది. ఇక, భారత్ సెమీస్ కి, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్లూ కూడా దుబాయ్లోనే జరుగుతాయని ఐసీసీ తెలిపింది. మరో సెమీ ఫైనల్కు మాత్రం పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్లోనే నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!