Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నిర్ణయం.. టోర్నీ జరగడం కష్టమే: పాక్
- ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నేడు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదు: పాక్ మాజీ కెప్టెన్
- పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో పోరాడలేవు: రషీద్ లతీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నేడు (డిసెంబర్ 11) తుది నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో తమ మ్యాచ్లనూ ఇదే మోడల్ను అనుసరించాలని ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లిఖితపూర్వకమైన హామీని కోరింది. భారత్ ఆతిథ్యం ఇచ్చే టోర్నమెంట్లో తాము మ్యాచ్ ఆడే వేదికలను తటస్థ వేదికలో ఏర్పాటు చేయాలనేది పీసీబీ కండిషన్ పెట్టింది. దీనిపై ఇవాళ జరగనున్న భేటీలో చర్చించి నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also: Robinhood : “రాబిన్ హుడ్” సినిమా వాయిదా.. ప్రచారంలో నిజమెంత ?
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐసీసీ సమావేశం మాత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. నేటి సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేస్తారని క్రికెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు. వచ్చే సంవత్సరం పాక్ ఆతిథ్యంలో ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉండగా.. బీసీసీఐ, పీసీబీ మధ్య సయోధ్య కుదరటం లేదన్నారు.
కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు. పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో పోరాడలేవని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే భారత్ బాయ్కాట్ చేస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్టాండ్ ఎలా ఉండాలి? అని క్వశ్చన్ చేశాడు. ఐసీసీ లేదా ఏసీబీ కలిసి వస్తాయా? లేదా అనేది మనం (పాకిస్థాన్) ఆలోచించుకోవాలని మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు.
Rashid Latif said “Pakistan should boycott the Champions Trophy now. Before BCCI takes this step, PCB should take it. Champions Trophy shouldn’t happen anymore” 🇵🇰🇮🇳🤯
— Farid Khan (@_FaridKhan) December 10, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?