Team India: ఆ నలుగురిలో ఇద్దరికి ఆసీస్ పర్యటనే చివరిది..?
- న్యూజిలాండ్ చేతిలో 0-3తో భారత్ ఘోర పరాజయం..
- ఆసీస్ పర్యటన తర్వాత నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు..
- యంగ్ ప్లేయర్స్కు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్ పిచ్లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లలో కనీసం ఇద్దరికి ఆసీస్ పర్యటనే ఆఖరిది కావొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చక్రంలో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీనే లాస్ట్ ది.
Read Also: Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..
Also Read
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
కాగా, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొత్త ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చక్రం స్టార్ట్ అవుతుంది. కివీస్ చేతిలో తాజా పరాజయం తర్వాత బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన డబ్ల్యూటీసీ చక్రం కోసం టీమిండియా జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ పెద్దల మధ్య అనధికారంగా చర్చ కొనసాగుతున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నారు. ఇది ఘోర పరాజయం.. దీనిపై కచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
అయితే, ఈనెల 10న ఆసీస్కు భారత జట్టు బయల్దేరనుంది. ఇప్పటికే జట్టును ప్రకటించడంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా అర్హత సాధించకపోతే కొంతమంది సీనియర్లపై వేటు పడొచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. బహుశా సొంతగడ్డపై నలుగురు సీనియర్లు కలిసి ఆడిన చివరి టెస్టు ఇదే కావొచ్చని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్స్ సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!