Team India: ఆ నలుగురిలో ఇద్దరికి ఆసీస్ పర్యటనే చివరిది..?
- న్యూజిలాండ్ చేతిలో 0-3తో భారత్ ఘోర పరాజయం..
- ఆసీస్ పర్యటన తర్వాత నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు..
- యంగ్ ప్లేయర్స్కు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్ పిచ్లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లలో కనీసం ఇద్దరికి ఆసీస్ పర్యటనే ఆఖరిది కావొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చక్రంలో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీనే లాస్ట్ ది.
Read Also: Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
కాగా, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొత్త ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చక్రం స్టార్ట్ అవుతుంది. కివీస్ చేతిలో తాజా పరాజయం తర్వాత బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన డబ్ల్యూటీసీ చక్రం కోసం టీమిండియా జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ పెద్దల మధ్య అనధికారంగా చర్చ కొనసాగుతున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నారు. ఇది ఘోర పరాజయం.. దీనిపై కచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
అయితే, ఈనెల 10న ఆసీస్కు భారత జట్టు బయల్దేరనుంది. ఇప్పటికే జట్టును ప్రకటించడంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా అర్హత సాధించకపోతే కొంతమంది సీనియర్లపై వేటు పడొచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. బహుశా సొంతగడ్డపై నలుగురు సీనియర్లు కలిసి ఆడిన చివరి టెస్టు ఇదే కావొచ్చని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్స్ సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!